News August 29, 2024
HYD: విమానం అత్యవసర ల్యాండింగ్.. దక్కని ప్రాణాలు
విమానంలో ఓ ప్రయాణికురాలిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. సిబ్బంది తెలిపిన వివరాలు.. కేరళకు చెందిన సోషమ్మ(89) బుధవారం కొచ్చి నుంచి ఓ విమాన సర్వీస్లో అమెరికాకు బయలుదేదారు. ప్రయాణంలో సోషమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్.. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సోషమ్మను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News September 30, 2024
HYD: చెరువుల హద్దులపై HMDAకు హైకోర్టు ఆర్డర్
HMDAలోని 3,532 చెరువులకుగానూ.. 230 చెరువులకు మాత్రమే బఫర్ జోన్, FTL నిర్ధారించారు. 2,525 చెరువులకు హద్దులను ఖరారు చేసింది. కాగా.. మరో 3 నెలల్లో 1,000 చెరువులకు హద్దులను నిర్ధారించాలని హైకోర్టు HMDAను ఆదేశించింది. హైకోర్టు నోటీసుల నేపథ్యంలో HMDA చర్యలకు ఉపక్రమించింది. నవంబర్లోగా పని పూర్తి చేయాల్సి ఉంది.
News September 30, 2024
HYD: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!
DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
RR 3231 205 1:15
HYD 2487 285 1:09
MDCL 646 41 1:15
VKB 4630 169 1:27
News September 30, 2024
HYD: నేడు అత్తాపూర్కు కేటీఆర్ రాక
మూసీ నిర్వాసితులను పరామర్శించడానికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం అత్తాపూర్లోని లక్ష్మీనగర్ కాలనీ, నందనవనం అపార్ట్మెంట్స్కు రానున్నారని ఆ పార్టీ నేత కొలను సుభాష్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించి వారితో మాట్లాడతారని పేర్కొన్నారు.