News March 2, 2025
HYD: వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

అంబర్పేట్ గోల్నాక జిందాతిలిస్మాత్ వీధిలో ఓ వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు నిర్వహించారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. అందులో ముగ్గురు ఉగాండా, ఒకరు కెన్యా చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వ్యభిచార గృహం నిర్వాహకుడు లైబీరియా దేశానికి చెందిన వ్యక్తితో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 3, 2025
టెన్త్ హాల్ టికెట్లు విడుదల

AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. https://bse.ap.gov.in/ వెబ్సైట్ నుంచి <
News March 3, 2025
చిత్తూరు: ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 609 మంది గైర్హాజరు

చిత్తూరు జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు DIEO సయ్యద్ మౌలా తెలిపారు. తొలి రోజు సోమవారం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పరీక్షలకు మొత్తం 12,220 మందికి గాను 11,711 మంది విద్యార్థులు హాజరుకాగా, 509 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్టు తెలిపారు. ఒకేషనల్ పరీక్షకు 1,809 మందికి గాను 1,709 మంది విద్యార్థులు హాజరు కాగా, 100 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు తెలిపారు.
News March 3, 2025
చదివేటప్పుడు నిద్ర కమ్ముకొస్తుందా?

అలా అయితే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని చదవడం ప్రారంభించండి. ఎట్టిపరిస్థితుల్లోనూ పడుకొని చదవొద్దు. చదివే సమయంలో నీరు ఎక్కువగా తాగండి. గట్టిగా చదవటం, నోట్స్ రాయటం వల్ల నిద్ర రాకుండా ఉంటుంది. 50ని.లకు ఒకసారి బ్రేక్ తీసుకొని, ముఖాన్ని చల్లటి నీటితో కడగండి. మీ రీడింగ్ రూంలో సరైన వెలుతురు ఉండేలా చూసుకోండి. బ్రేక్ టైంలో కాస్త నడిస్తే మైండ్ రీఫ్రెష్ అవుతుంది. లైట్ ఫుడ్ తీసుకుంటే మంచిది. Share It.