News April 6, 2025
HYD: శోభాయాత్ర.. ఈ రూట్లు బంద్!

శ్రీ రామనవమి శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని HYD పోలీసులు తెలిపారు. సౌత్ వెస్ట్ జోన్లో 9AM నుంచి 4PM వరకు, ఈస్ట్ జోన్లో 2PM నుంచి 9PM వరకు ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. 20 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, MJ మార్కెట్, పుత్లీబౌలి మీదుగా సుల్తాన్బజార్కు ర్యాలీగా వెళ్తారు. ప్రత్యామ్నాయ రూట్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.SHARE IT
Similar News
News April 9, 2025
RRతో మ్యాచ్.. గుజరాత్ బ్యాటింగ్

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో GTతో మ్యాచులో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్: జైస్వాల్, సంజూ శాంసన్ (C), నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్మెయిర్, ధ్రువ్ జురెల్, ఆర్చర్, తీక్షణ, ఫరూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే
గుజరాత్: సాయి సుదర్శన్, గిల్ (C), బట్లర్, రూథర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ
News April 9, 2025
ఒంటిమిట్ట కళ్యాణ వేడుక ఏర్పాట్ల పరిశీలన

11వ తేదీన జరగబోయే ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని కళ్యాణం వేడుకకు సంబంధించి పటిష్టమైన ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఒంటిమిట్ట కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి పరిశీలించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు సిబ్బందికి కలెక్టర్ సూచించారు.
News April 9, 2025
కృష్ణా: మండలానికి 3 లేదా 4 ఆదర్శ పాఠశాలలు- కలెక్టర్

విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి అంగీకారంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులు, ఆర్డీఓతో సంయుక్త సమావేశం నిర్వహించారు. పాఠశాలల పునఃవ్యవస్థీకరణపై ఆయన సమీక్షించారు. మండలానికి కనీసం 3 లేదా 4 ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.