News March 16, 2025
HYD: శ్రీరాములు పేరిట తెలుగు విశ్వవిద్యాలయం

తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును HYDలోని తెలుగు విశ్వవిద్యాలయానికి నామకరణం చేశారు. 1985లో DEC 2న నాటి CM NTR ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత దీనికి 1998లో అమరజీవి పేరు పెట్టారు. కూచిపూడిలోని సిద్దేంద్ర కళాక్షేత్రాన్ని విశ్వవిద్యాలయంలో విలీనం చేశారు. తెలుగు ప్రజల కోసం ఆత్మబలిదానం చేసిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం.
Similar News
News March 17, 2025
వనపర్తి జిల్లాలో మండుతున్న ఎండలు

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అత్యధికంగా కానాయిపల్లిలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెబ్బేరు 42.1, విలియంకొండ 41.6, పెద్దమందడి 41.1, వనపర్తి 40.7, రేమద్దుల 40.7, గనపూర్ 40.4, వెలుగొండ 40.4, రేవల్లి 40.3, ఆత్మకూర్ 40.3, మదనపూర్ 39.9, దగడ 39.9, పాన్గల్ 39.6, సోలిపూర్ 39.6, గోపాల్ పేట 39.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 17, 2025
భద్రత పెంచుతాం.. డీకే అరుణకు సీఎం హామీ

TG: బీజేపీ ఎంపీ డీకే అరుణ <<15780375>>ఇంట్లో ఆగంతకుడు<<>> ప్రవేశించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎంపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత పెంచుతామని ఆమెకు హామీకి ఇచ్చారు. ఈ ఘటనలో విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసులను సీఎం ఆదేశించారు. భద్రత పెంచాలని పోలీస్ శాఖకు సూచించారు.
News March 17, 2025
భువనగిరి కోటపైన రోప్ వే

భువనగిరి కోటపైన రోప్ వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. కి.మీ మేర దీనిని నిర్మించేందుకు పర్యాటక సంస్థ రూ.56.81 కోట్లతో టెండర్లను పిలిచింది. HYD-WGL హైవే నుంచి కోట వరకు ఈ రోప్ వే ఉండనుండగా రాష్ట్రంలో ఇది మొదటిది కానుంది. మరో నాలుగు రోప్ వేలకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అందులో యాదాద్రి టెంపుల్, నల్గొండ హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట ఉన్నాయి.