News April 9, 2025

HYD: సమ్మర్ స్పెషల్.. యాత్రలకు స్పెషల్ ప్యాకేజీ!

image

SCR అధికారులు ‘భారత్ గౌరవ్’ వేసవి ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్ధమయ్యారు. ప్యాకేజీ-1 కింద హరిద్వార్- రిషికేష్- వైష్ణోదేవి యాత్రకు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు రైళ్లను నడపనున్నట్లు పేర్కొన్నారు. టిక్కెట్ ధర రూ.18,510 నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించారు. HYD నగర వాసులు సైతం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 19, 2025

ఆర్ఎస్పీపై తప్పుడు ప్రచారాలు.. తెలంగాణ గళంపై ఫిర్యాదు

image

కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు “తెలంగాణ గళం” అనే సోషల్ మీడియా సంస్థపై ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్యామ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ గళం అనే సోషల్ మీడియా సంస్థ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్పీ ఫోటోలు వీడియోలను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేసిందన్నారు. బీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా చేసిన ఈ తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు.

News April 19, 2025

కొబ్బరి కాయలో నీళ్లు ఎలా వస్తాయి?

image

కొబ్బరికాయలో ఎక్సోకార్ప్(పచ్చని పైపొర), మీసోకార్ప్(పీచు), ఎండోకార్ప్(టెంక) అనే 3 పొరలుంటాయి. ఎండోకార్ప్‌లో ఎండోస్పెర్మ్(ముదిరాక కొబ్బరి), నీళ్లు అనే రెండు భాగాలుంటాయి. కొబ్బరి చెట్టులోని వాస్క్యులర్(రవాణా) వ్యవస్థ వేళ్ల నుంచి ఖనిజాలు కలిగిన భూగర్భ జలాలను జైలమ్ నాళాల ద్వారా టెంకలోకి చేరుస్తుంది. వాటినే కొబ్బరి నీళ్లు అంటాం. కాయ ముదిరే కొద్ది నీరే కొబ్బరిగా మారుతూ ఉంటుంది.

News April 19, 2025

మందమర్రి: యువకుడి ఇంటిముందు హిజ్రాల ధర్నా

image

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో హిజ్రాలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పట్టణంలోని మొదటి జోన్ కమ్యూనిటీ హాల్ వెనకాల హిజ్రాలను వేధింపులకు గురి చేస్తున్న ఓ యువకుడి ఇంటి ముందు హిజ్రాలు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. తమను యువకుడు అసభ్య పదజాలంతో వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. అతని వలన తీవ్ర ఆందోళనకు గురవుతున్నామన్నారు. వెంటనే అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!