News March 29, 2024

USA క్రికెట్ జట్టులో హైదరాబాద్ అమ్మాయి

image

అమెరికా మహిళల జాతీయ క్రికెట్ జట్టులో హైదరాబాద్‌కు చెందిన ఇమ్మడి సాన్వికి చోటు దక్కింది. యూఏఈలో జరగనున్న ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఆమె అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. 2020లో యూత్ క్రికెట్ అసోసియేషన్ కాలిఫోర్నియా తరఫున ఆమె అరంగేట్రం చేశారు. ఆమె రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్. సాన్వి కుటుంబం సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండీకి చెందినది.

Similar News

News March 26, 2026

బావ కాదు.. రాక్షసుడు!

image

డబ్బు కక్కుర్తి ఒక నిష్కల్మషమైన పసి <<19480775>>ప్రాణాన్ని<<>> బలి తీసుకుంది. అత్తమామలు డబ్బులు ఇవ్వలేదని యాడికి మం. కోన ఉప్పలపాడుకు చెందిన 5ఏళ్ల హేమచంద్రను సొంత బావ సర్వేశ్ కిరాతకంగా హతమార్చడం కలచివేస్తోంది. తనను ఎత్తుకున్న బావే కాలయముడిలా మారుతాడని ఆ బాలుడు ఊహించి ఉండడు. గుట్టల్లో ఆ పసివాడు ప్రాణ భయంతో ఎంతలా విలవిలలాడాడో తలచుకుంటేనే కన్నీళ్లు ఆగవు. మనిషిలో ఇంతటి క్రూరత్వమా? అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

News March 26, 2026

వీర సైనికులకు కేంద్రం గుడ్ న్యూస్!

image

గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు భారత ప్రభుత్వం శుభవార్త అందించింది. సేన, నేవీ సేన, వాయు సేన పతకాలు పొందిన జవాన్లకు ఇండియన్ రైల్వేలో లైఫ్‌లాంగ్ ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మరొకరితో కలిసి ఫస్ట్ క్లాస్, 2 ఏసీ లేదా ఏసీ ఛైర్ కార్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సదుపాయం అవార్డు గ్రహీతలకు, వారి జీవిత భాగస్వాములకు లేదా అవివాహిత అమరవీరుల తల్లిదండ్రులకు వర్తిస్తుంది.

News March 26, 2026

యుద్ధం.. భారత్‌పై ఇరాన్ ఒత్తిడి!

image

యుద్ధం వల్ల దౌత్యపరంగా భారత్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. US, ఇజ్రాయెల్ దాడులను BRICS కూటమి ఖండించేలా చర్యలు తీసుకోవాలని భారత్‌ను ఇరాన్‌ కోరినట్లు సమాచారం. అయితే కూటమిలో ఇరాన్ ప్రత్యర్థులైన సౌదీ – UAE ఉండటం, అమెరికా-ఇజ్రాయెల్ కూడా మిత్రపక్షాలే కావడం భారత్‌కు సవాల్‌గా మారింది. దీంతో ఈ ఏడాది BRICSకు అధ్యక్షత వహిస్తున్న భారత్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.