News January 11, 2025
ఊరెళ్లే జనాలతో రద్దీగా మారిన హైదరాబాద్

సంక్రాంతి పండగకు ఊరెళ్ల జనాలతో హైదరాబాద్ రద్దీగా మారింది. రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు మొదలు కానుండటంతో ప్రజలు స్వస్థలాలకు బయల్దేరారు. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, కూకట్పల్లి, అమీర్పేట్, ఎస్సార్నగర్ తదితర ప్రాంతాల్లో కిటకిటలాడుతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రేపు, ఎల్లుండి కూడా నగరంలో రద్దీ కొనసాగనుంది.
Similar News
News October 19, 2025
దీపావళి ‘విజేత’ ఎవరు?

ఈ సారి పండక్కి మీడియం, చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ నెల 16న ప్రియదర్శి, నిహారిక నటించిన ‘మిత్ర మండలి’, 17న ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ‘డ్యూడ్’, సిద్ధు, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ‘తెలుసు కదా’, 18న కిరణ్ అబ్బవరం, యుక్తి ‘K RAMP’ రిలీజయ్యాయి. ఎంటర్టైన్మెంట్, లవ్ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాలు తెరకెక్కాయి. మీరు ఏ సినిమాకు వెళ్లారు? ఈ దీపావళి విజేత ఎవరు? కామెంట్.
News October 19, 2025
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక ధన్వంతరీ ఆలయం

తూ.గో. జిల్లాలోని చింతలూరు గ్రామంలో ధన్వంతరి స్వామి ఆలయం ఉంది. ఇక్కడ కాశీ ఏకశిలతో మలచిన పాలరాతి విగ్రహ రూపంలో స్వామివారు కొలువై ఉంటారు. నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, అమృత కలశం, జలగ ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడే కాకుండా శ్రీరంగం రంగనాథ ఆలయం, కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయం, కేరళలోని గురువాయూర్ సమీపంలో కూడా ధన్వంతరి ఆలయాలు ఉన్నాయి.
News October 19, 2025
ఎలాంటి గొర్రెలు కొంటే ఎక్కువ ప్రయోజనం?

ఆడ గొర్రెలు ఏడాదిన్నర వయసు, 8-10 కిలోల బరువు.. పొట్టేలు రెండేళ్ల వయసు, 10- 15 కిలోల బరువు ఉండాలి. రైతుల మంద నుంచి గొర్రెలు కొనడం మంచిది. రెండు ఈతలకు మధ్య ఎక్కువ సమయం తీసుకునే గొర్రెలు వద్దు. చూడి, మొదటిసారి ఈనిన గొర్రెలను కొంటే మంద పెరిగే ఛాన్సుంది. విత్తనపు పొట్టేలు, బలంగా, ఎత్తుగా ఉండి.. ఎక్కువ పిల్లలకు జన్మనిచ్చే సామర్థ్యంతో ఉండాలి. మందలో ప్రతీ 30 ఆడ గొర్రెలకు ఒక విత్తనపు పొట్టేలు ఉండాలి.