News September 1, 2024

హైదరాబాద్ JNTU పరిధిలో పరీక్షలు వాయిదా

image

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌ JNTU ప‌రిధిలో సోమ‌వారం జ‌ర‌గాల్సిన ప‌లు ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్ట‌ర్ ఆర్‌18, 16, 15, 13 – బీఫార్మ‌సీ మూడో ఏడాది మొద‌టి సెమిస్ట‌ర్ ఆర్‌17, 15, 13 స‌ప్లిమెంట‌రీ, అలాగే ఎంబీఏ మొద‌టి ఏడాది ఫ‌స్ట్ సెమిస్ట‌ర్ ఆర్‌22, 19 స‌ప్లిమెంట‌రీ పరీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. సెప్టెంబ‌ర్ 2న జ‌ర‌గాల్సిన ఈ ప‌రీక్ష‌లు Sep 5వ తేదీకి వాయిదా ప‌డ్డాయి.

Similar News

News November 22, 2025

ఆస్కార్ బరిలో ‘మహావతార్ నరసింహ’

image

దేశంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ ఆస్కార్ రేసులో నిలిచింది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి నామినేట్ అయింది. KPop Demon Hunters, Zootopia 2 వంటి చిత్రాలతో పోటీ పడనుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి భారత్‌లో విపరీతమైన ఆదరణ లభించింది. ప్రజలు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా రూ.326 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

News November 22, 2025

ఆస్కార్ బరిలో ‘మహావతార్ నరసింహ’

image

దేశంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ ఆస్కార్ రేసులో నిలిచింది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి నామినేట్ అయింది. KPop Demon Hunters, Zootopia 2 వంటి చిత్రాలతో పోటీ పడనుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి భారత్‌లో విపరీతమైన ఆదరణ లభించింది. ప్రజలు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా రూ.326 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

News November 22, 2025

రేపు భారత్ బంద్‌కు పిలుపు

image

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు. బంద్‌కు అంతా సహకరించాలని కోరారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, నేతలు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలు విడిచి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. పలు ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.