News February 5, 2025
రొమ్ము క్యాన్సర్ కేసుల్లో హైదరాబాద్ టాప్

దేశంలో అత్యధికంగా హైదరాబాద్లో రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదైనట్లు NIMS విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీ (PBCR) నివేదిక (2014–2016) ప్రకారం HYDలో లక్ష మంది మహిళల్లో 48 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. తర్వాతి స్థానాల్లో చెన్నై(42.2), బెంగళూరు(40.5), ఢిల్లీ(38.6), ముంబై(34.4) ఉన్నాయి. మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో అత్యధికంగా రొమ్ము క్యాన్సరే(35.5%) ఉంది.
Similar News
News November 1, 2025
APPLY NOW: ముంబై పోర్ట్ అథారిటీలో 116 పోస్టులు

ముంబై పోర్ట్ అథారిటీ 116 కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్, బీఈ, బీకామ్, బీఏ, బీఎస్సీ, బీసీఏ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100. www.apprenticeshipindia.gov.in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్: https://mumbaiport.gov.in/
News November 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 53

1. జ్యోతిర్లింగం మొదలు, తుది తెలుసుకోలేని దేవతలు ఎవరు?
2. తారకాసురుని సంహరించింది ఎవరు?
3. దక్ష యజ్ఞాన్ని నాశనం చేసిన శివుడి ఉగ్ర రూపం పేరు?
4. శ్రీకృష్ణుడికి బాణం వేసిన వేటగాడి పేరు?
5. పంచభూత స్థలాల్లో భూమి(పృథ్వీ) లింగం ఎక్కడ ఉంది?
☛ సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
Ithihasaluquiz
News November 1, 2025
కర్నూలు ప్రమాదం: దుష్ప్రచారం చేశారంటూ 27 మందిపై కేసు

AP: కర్నూలు బస్సు దుర్ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ 27 మందిపై కేసు నమోదైంది. ఇందులో YCP అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల, సీవీ రెడ్డి, కందూరి గోపీకృష్ణ, YCP ట్విటర్ నిర్వాహకులు ఉన్నారు. కర్నూలు రూరల్(M) తాండ్రపాడుకు చెందిన వేణుములయ్య ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి కల్తీ మద్యం, బెల్టుషాపులే <<18120317>>కారణమని<<>> ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా పోస్టులు పెట్టారని అందులో పేర్కొన్నారు.


