News September 21, 2024

మూసీలో రేపటి నుంచి హైడ్రా కూల్చివేతలు షురూ

image

హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళనలో భాగంగా పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణల కూల్చివేతలకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలుత నదీ గర్భంలోని ఆక్రమణలను తొలగించనున్నారు. దాదాపు 55K.Mల పరిధిలో 12వేలకు పైగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కూల్చివేతల బాధ్యతలను హైడ్రాకు అప్పగించగా, రేపటి నుంచి బుల్డోజర్ రంగంలోకి దిగనుంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని మంత్రి పొన్నం తెలిపారు.

Similar News

News October 26, 2025

అలీబాబా దొంగల ముఠాలా రేవంత్ పాలన తయారైంది: KTR

image

TG: రాష్ట్రంలో పరిపాలన రౌడీ షీటర్ల పాలన అయ్యిందని మాజీమంత్రి KTR విమర్శించారు. తెలంగాణ భవన్‌లో హోటల్స్ కార్మిక యూనియన్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘మంత్రి OSD తుపాకీతో బెదిరించారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారు. మంత్రి బిడ్డ బయటకొచ్చి తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి అన్నారు. మంత్రి భర్త తుపాకీ ఇచ్చారని పోలీసులు అంటున్నారు. అలీబాబా దొంగల ముఠాలా పాలన తయారైంది’ అని ఎద్దేవా చేశారు.

News October 26, 2025

శ్రీరామ నామ జప ఫలితాలు

image

నిరంతరం శ్రీరామ నామ జపం చేయడం వలన మనస్సుకు శాంతి లభిస్తుంది. పాపాలు, దోషాలు నశించి, చిత్తశుద్ధి కలుగుతుంది. దీని ద్వారా హృదయంలో భగవంతుని పట్ల భక్తి పెంపొందుతుంది. నామ సంకీర్తన వలన దుఃఖాలు తొలగి, జీవితంలో ఆనందం నిండుతుంది. అష్టైశ్వర్యాలు, మోక్షం వంటి ఫలాలను కూడా ఈ నామ జపం ప్రసాదిస్తుంది. సర్వవిధాల శ్రేయస్సును, అంతిమంగా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి నామ జపం ఉత్తమమైన మార్గం. <<-se>>#Bakthi<<>>

News October 26, 2025

భారీ వర్ష సూచన.. మరికొన్ని జిల్లాల్లో సెలవులు

image

AP: రేపట్నుంచి మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ప్రకాశం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 27, 28, 29 తేదీల్లో హాలిడేస్ ఇచ్చారు. విశాఖ, ఏలూరు జిల్లాలో 27, 28 తేదీల్లో.. చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో 27న సెలవులిస్తూ డీఈవోలు ప్రకటించారు. ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు <<18106376>>హాలిడేస్ ప్రకటించిన<<>> విషయం తెలిసిందే.