News September 27, 2024
YCP నేత శిల్పాకు హైడ్రా నోటీసులు

TG: వైసీపీ నేత, మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డికి హైడ్రా నోటీసులు పంపింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సాన్పల్లిలోని నల్లవాగును శిల్పా కబ్జా చేసి వెంచర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. తాజాగా సర్వే చేపట్టి వెంచర్లోని ఆక్రమణలను అధికారులు కూల్చివేస్తున్నారు.
Similar News
News November 13, 2025
కొబ్బరి సాగు.. భూమిని బట్టి నీరివ్వాలి

కొబ్బరి తోటలను నల్ల భూముల్లో పెంచుతుంటే 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్రభూముల్లో సాగు చేస్తుంటే 10 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందించాలి. తేలిక భూముల్లో అయితే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. తోటల్లో నీటి ఎద్దడి వల్ల కొబ్బరిలో పిందెరాలడం, కాయ పరిమాణం తగ్గడం వంటి సమస్యలు తలెత్తి పంట దిగుబడి తగ్గుతుంది.
News November 13, 2025
శివుడికి మూడో నేత్రం నిజంగానే ఉంటుందా?

శివుడికి మూడో నేత్రం ఉంటుంది. కానీ, చిత్రపటాల్లో చూపించినట్లు అది భౌతికమైనది కాదు. ఆ నేత్రం జ్ఞానానికి, అంతర దృష్టికి సంకేతం. దాని ద్వారానే ఆయన లోకాలను నడిపిస్తున్నాడు. ఆయన అంతటి జ్ఞానవంతుడని తెలిపేందుకే విగ్రహాలు, ఫొటోల్లో ఆ నేత్రాన్ని చూపిస్తారు. జ్ఞానం అనే ఈ మూడో కన్ను మనక్కూడా ఉంటుందని, దాని ద్వారా జీవిత సత్యాన్ని తెలుసుకున్నవారు మోక్షం వైపు అడుగులేస్తారని పురాణాలు చెబుతున్నాయి. <<-se>>#SIVA<<>>
News November 13, 2025
ఇస్రో షార్లో 141 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<


