News August 24, 2024

‘హైడ్రా’ రంగనాథ్.. సంచలన కేసులకు కేరాఫ్

image

2007లో ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా(ఇబ్రహీంపట్నం) హత్య కేసు ప్రత్యేక దర్యాప్తు అధికారిగా రంగనాథ్ కీలకంగా వ్యవహరించారు. అలాగే తెలంగాణలోని నల్గొండలో అమృత-ప్రణయ్ కేసులో నిందితుడు మారుతిరావు అరెస్టు, విచారణను సమర్థంగా నిర్వహించారు. వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసును ఆయనే డీల్ చేసి నిందితుడు సైఫ్‌ను త్వరగా అరెస్టు చేశారు. ఇప్పుడు హైడ్రా కమిషనర్‌గా తన మార్క్ చూపుతున్నారు.

Similar News

News November 24, 2025

BMC బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

బాంబే మర్కంటైల్ కోఆపరేటివ్(BMC) బ్యాంక్ లిమిటెడ్‌.. బ్యాంక్ మేనేజర్, క్రెడిట్ ఆఫీసర్, ఏరియా హెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 1, 2026వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 -50ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://bmcbankltd.com/

News November 24, 2025

భారతీయ వైద్యం వైపు అమెరికన్ల మొగ్గు!

image

అమెరికాతో పోల్చితే ఇండియాలో వైద్య సదుపాయం చాలా బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. ఈక్రమంలో పెరుగుతున్న ఖర్చులు, వెయిటింగ్ కారణంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల రోగులు భారతీయ వైద్యం వైపు మళ్లుతున్నట్లు పేర్కొన్నారు. ‘భారత్‌లో అత్యల్ప ఖర్చు, తక్షణ అపాయింట్‌మెంట్‌లు (సూపర్ స్పెషలిస్ట్‌లతో సహా), MRI/CT స్కాన్ల వంటి త్వరిత డయాగ్నస్టిక్ సేవల వల్ల రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి’ అని తెలిపారు.

News November 24, 2025

పెరిగిన మంచు తీవ్రత.. మినుము పంటకు తెగుళ్ల ముప్పు

image

గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం వల్ల మినుము పంటలో.. కాయ దశలో ఆకు మచ్చ తెగులు మరియు బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంది. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా ఒక మి. లీ ప్రాపికొనజోల్ 1ml కలిపి పిచికారీ చేయాలి. వీటితో పాటు లీటరు నీటికి 1ml మైక్లోబుటానిల్ పిచికారీ చేసి బూడిద తెగులును కూడా నివారించవచ్చని వ్యవసాయ నిపుణులు తెలిపారు.