News November 7, 2024

బెంగళూరు పర్యటనకు హైడ్రా బృందం

image

TG: హైడ్రా బృందం రెండు రోజుల పర్యటనకు గాను బెంగళూరు వెళ్లింది. అక్కడ చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో బృందం అధ్యయనం చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో ఆక్రమణల తొలగింపుపై హైడ్రా కాస్త నెమ్మదించింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో నిఘా, రియల్ టైమ్‌లో కబ్జాలను కనిపెట్టేలా టెక్నాలజీని హైడ్రా పటిష్ఠపర్చుకుంటోంది.

Similar News

News January 18, 2026

జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. ఏడుగురు సైనికులకు గాయాలు

image

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు సైనికులు గాయపడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఛత్రూ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పాయి. ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నాయి.

News January 18, 2026

రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్‌గా మారింది: మాజీ మంత్రి

image

AP: గతంలో క్యాసినోల కోసం శ్రీలంక, గోవా వెళ్లేవారని.. ఇప్పుడు అన్నీ ఏపీలోనే దొరుకుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్‌గా మారిందని ఎద్దేవా చేశారు. MLAలంతా సంపాదనపై పడ్డారని ఆరోపించారు. పేకాట, కోడి పందేలా పేరిట దోచుకో, దాచుకో, పంచుకో అన్నట్లుగా తయారయ్యారని మండిపడ్డారు.

News January 18, 2026

నీటి నిల్వకు ఇంకుడు గుంత ఎక్కడ తవ్వాలి?

image

ఇంకుడు గుంతను ఇంటి బయట ఈశాన్య దిశలో(పిశాచ స్థానంలో) నిర్మించడం వల్ల నీటి ఎద్దడి తప్పుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అయితే, అన్ని సందర్భాల్లో ఈశాన్యంలోనే నీరు పడాలని లేదు కాబట్టి బోరుకు దగ్గరగా ఎక్కడైనా గుంత ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవాలని, కఠినమైన నియమాల కంటే అవసరానికి తగ్గట్టుగా శాస్త్రాన్ని అనువైన రీతిలో మార్చుకోవాలని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>