News November 7, 2024

బెంగళూరు పర్యటనకు హైడ్రా బృందం

image

TG: హైడ్రా బృందం రెండు రోజుల పర్యటనకు గాను బెంగళూరు వెళ్లింది. అక్కడ చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో బృందం అధ్యయనం చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో ఆక్రమణల తొలగింపుపై హైడ్రా కాస్త నెమ్మదించింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో నిఘా, రియల్ టైమ్‌లో కబ్జాలను కనిపెట్టేలా టెక్నాలజీని హైడ్రా పటిష్ఠపర్చుకుంటోంది.

Similar News

News September 17, 2025

గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌కు టీజీపీఎస్సీ

image

TG: గ్రూప్-1 మెయిన్స్‌ <<17655670>>ఫలితాలను<<>> రద్దుచేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ నెల 9న ఫలితాలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

News September 17, 2025

GST సంస్కరణలతో వారికి మేలు: సత్యకుమార్

image

AP: జీఎస్టీ సంస్కరణలు మధ్యతరగతి, పేదలకు మేలు చేసేలా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మార్పులతో ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచి, వస్తువుల ధరలు నియంత్రణలోకి వస్తాయని తెలిపారు. 2047నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కేంద్రం శ్రమిస్తోందన్నారు. గత ఐదేళ్లలో దివాళా తీసిన రాష్ట్ర ఎకానమీని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందని తెలిపారు.

News September 17, 2025

మోదీ బయోపిక్.. పోస్టర్ రిలీజ్

image

ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ రూపొందుతోంది. దీనికి ‘మా వందే’ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను క్రాంతి కుమార్‌ సీహెచ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్‌లో కనిపిస్తారు. పోస్టర్‌పై మోదీ సంతకం చేస్తున్నట్లు ఉన్న ఫొటో ఉండగా.. ‘ఎన్నో పోరాటాల కన్నా, తల్లి సంకల్ప బలం గొప్పది’ అని మోదీ చెప్పిన మాటలను ముద్రించారు.