News September 24, 2024
HYDRAది ద్వంద్వ వైఖరి: BRS

TG: హైడ్రా ద్వంద్వ వైఖరి మరోమారు బట్టబయలైందని BRS ఆరోపించింది. ‘దుర్గం చెరువు ఆక్రమణలకు నోటీసులు ఇచ్చి, అందులో రేవంత్ సోదరుడు ఉండటంతో మీనమేషాలు లెక్కిస్తోంది. బడాబాబుల వైపు కన్నెత్తి చూడటం లేదు. పేదోడి ఇంటిపైకి శరవేగంగా హైడ్రా బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి. పేదోళ్ల ఇళ్లను కూలుస్తూ బడాబాబులకు మాత్రం నోటీసుల పేరుతో సమయం ఇస్తోంది’ అని ట్వీట్ చేసింది.
Similar News
News September 14, 2025
గొర్రెల్లో చిటుక వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధి బారినపడిన జీవాల్లో తొలుత లక్షణాలు ఎక్కువగా బయటకు కనిపించవు. వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు విపరీతమైన జ్వరం వస్తుంది. మేత మేయకుండా గొర్రెలు నీరసపడతాయి. సరిగా నడవలేవు. నోటి నుంచి చొంగ కారుస్తూ, పళ్లు కొరుకుతూ బిగుసుకొని చనిపోతాయి. కొన్నిసార్లు చిటుక వ్యాధికి గురైన గొర్రె పిల్లలు చెంగున గాలిలోకి ఎగిరి, హఠాత్తుగా మరణిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశు వైద్యులను సంప్రదించాలి.
News September 14, 2025
తిరుమల శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి సర్వదర్శనం క్యూ లైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి కొనసాగుతోంది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. శనివారం 82,149 మంది స్వామి వారిని దర్శించుకోగా 36,578 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు వచ్చిందని ప్రకటించింది.
News September 14, 2025
నేడు మళ్లీ చర్చలు.. విఫలమైతే కాలేజీలు బంద్

TG: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్(FATHI) రేపటి నుంచి ఇంజినీరింగ్ కాలేజీల <<17690252>>బంద్కు<<>> పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిధుల విడుదలపై నిన్న Dy.CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబుతో FATHI జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇవాళ మరోసారి మీటింగ్ జరగనుంది. సయోధ్య కుదరకపోతే రేపటి నుంచి ప్రొఫెషనల్ కాలేజీలు, 16 నుంచి డిగ్రీ, PG కాలేజీలు బంద్ చేసే అవకాశముంది.