News January 5, 2025
HYDలో IT శిక్షణకు అడ్డాగా అమీర్పేట
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736002498936_15795120-normal-WIFI.webp)
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సంబంధిత కోర్సుల శిక్షణకు అమీర్పేట అడ్డాగా మారింది. 1992 నుంచి ఇక్కడ ఐటీ శిక్షణ కొనసాగుతోంది. పైథాన్, డాట్ నెట్, డిజిటల్ మార్కెటింగ్, జావా, సీ ప్లస్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ వంటి విభిన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన ఎంతో మంది ఐటీ కొలువుల్లో రాణిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News January 8, 2025
చర్లపల్లి టెర్మినల్ ఓపెన్.. మరి రోడ్లు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736269031432_15795120-normal-WIFI.webp)
చర్లపల్లి టెర్మినల్ అత్యాధునిక హంగులతో ప్రారంభమైంది. స్టేషన్కు వెళ్లే రోడ్లను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికుల అభిప్రాయం. సిటీ నుంచి వచ్చే వారు హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ మీదుగా స్టేషన్కు చేరుకోవచ్చు. కీసర, మేడ్చల్, ECIL వాసులు రాంపల్లి మీదుగా వస్తారు. ప్రస్తుతం ఈ రహదారులు బాగానే ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ పెరిగితే రోడ్లను విస్తరించాల్సిందేనా..? దీనిపై మీ కామెంట్?
News January 7, 2025
ఎస్సీ వర్గీకరణ అమలుకు కృషి చేస్తా: AICC సెక్రెటరీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736235773012_52383630-normal-WIFI.webp)
AICC సెక్రెటరీ సంపత్ కుమార్ను మంద కృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయించాలని సంపత్ని కోరారు. చేవెళ్ల డిక్లేరేషన్, అసెంబ్లీలో CM రేవంత్ చేసిన ప్రకటనకు అనుగుణంగా వర్గీకరణను త్వరగా అమల్లోకి తీసుకొచ్చేలా కృషి చేయాలన్నారు. వేల గొంతులు-లక్షల డప్పుల కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. వర్గీకరణ పూర్తవడానికి తన వంతు కృషి చేస్తానని సంపత్ హామీ ఇచ్చారని కృష్ణ తెలిపారు.
News January 7, 2025
క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం: CM
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736235800277_51976569-normal-WIFI.webp)
క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి HYDలోని సీఎం నివాసంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డితో కలిసి 68వ ఎస్జీఎఫ్ఐ అండర్-17 బాలబాలికల జాతీయ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల పోస్టర్ను సీఎం ఆవిష్కరించారు. ఈ పోటీలు ఈనెల 10 నుంచి 14 వరకు మహబూబ్నగర్ జిల్లా మైదానంలో ప్రారంభం కానున్నాయి.