News March 20, 2025

HYDలో బొట్టు పెట్టుకున్న విశ్వ సుందరి!

image

మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా బేగంపేటలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మధ్యాహ్నం 12:00 గంటలకు హోటల్ టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ –2025 ప్రీ-లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంప్రదాయంలో చీర కట్టు, బొట్టు పెట్టుకొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ‘నమస్తే ఇండియా’ అని పలకరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక్కడి ట్రెడిషన్ చాలా బాగా నచ్చింది అంటూ కితాబిచ్చారు.

Similar News

News December 18, 2025

కర్నూలు: AP, తెలంగాణలో ఎస్సైగా ఎంపిక.. చివరికి..!

image

కర్నూలు జిల్లా తుగ్గలి పోలీస్ స్టేషన్‌లో అనంతపురం(D) తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన నరేశ్ ఎస్సైగా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. 2022లో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఎస్సై నియామకాల్లో ఎంపికయ్యారు. 2023లో ఏపీ విడుదల చేసిన ఎస్సై ఫలితాలలో ఉత్తీర్ణుడయ్యారు. తెలంగాణలో వద్దనుకొని ఏపీలో విధులు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. అనంతపురం PTC కళాశాలలో ట్రైనింగ్ అనంతరం తుగ్గలిలో బాధ్యతలు చేపట్టారు.

News December 18, 2025

ప్రతి పాఠశాలలో వారం రోజులు వేడుకలు: డీఈవో

image

కర్నూలు జిల్లాలో ఈనెల 18 నుంచి 24 వరకు అన్ని ఉన్నత పాఠశాలల్లో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.సుధాకర్ తెలిపారు.19న ఏపీజే అబ్దుల్ కలాం మునిసిపల్ హైస్కూల్‌లో 8, 9వ తరగతి విద్యార్థులకు డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీలు జరగనున్నాయి. విజేతలకు రూ.5 వేల వరకు బహుమతులు అందజేస్తారు.

News December 18, 2025

తగ్గేదేలే: సర్పంచ్‌గా కూతురు, ఉప సర్పంచ్‌గా తండ్రి!

image

బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కీలక పదవులు దక్కించుకొని రికార్డు సృష్టించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కట్ట సంధ్యారెడ్డి సర్పంచ్‌గా ఘనవిజయం సాధించగా, ఆమె తండ్రి కట్ట ముత్యం రెడ్డి వార్డు సభ్యుడిగా గెలుపొంది, అనంతరం ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఒకే గ్రామంలో తండ్రీకూతుళ్లు సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులను దక్కించుకోవడం విశేషం.