News March 28, 2024
HYDలో రాముడి శోభాయాత్రకు భారీ ప్లాన్..!
శ్రీ రామనవమికి భాగ్యనగరం ముస్తాబవుతోంది. 20 రోజుల ముందే ఆయా ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ధూల్పేటలో నిర్వహించే రాముడి శోభాయాత్రకు తరలిరావాలని రాజాసింగ్ పిలుపునిస్తున్నారు. ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 11 గంటలకు ఆకాశ్పురి హనుమాన్ టెంపుల్ నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. యాత్రను విజయవంతం చేయాలంటూ ఆయన అనుచరులు, అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Similar News
News September 30, 2024
HYD: విదేశాల్లో చదువుకునేందుకు BEST CHANCE
మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యా పథకం కింద అర్హులైన HYD, RR, MDCL, VKBలోని బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబర్ 15లోగా ఈపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. 35 ఏళ్లు, ఇంజనీర్, మేనేజ్మెంట్ సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సెన్స్, అగ్రికల్చర్లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు. విదేశీ వర్సిటీల నుంచి ఐ-20 ఫామ్ పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News September 30, 2024
ముషీరాబాద్: కుల, మతాంతర వివాహలు చట్టబద్ధమే
కుల మతాంతర వివాహాలు రాజ్యాంగబద్ధమేనని ప్రభుత్వం పౌర సమాజం అభ్యుదయ వివాహాలను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధా రాణి పిలుపునిచ్చారు. ఆదివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు.ఈ సదస్సుకు కేవీఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎం దశరథ్ అధ్యక్షత వహించారు.
News September 29, 2024
HYD: మూసీ భాదితులను కన్న బిడ్డల్లా చూసుకుంటాం: మంత్రి
మూసి నిర్వాసితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాళ్లను కాపాడే భాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సొంత నివాసం లేని వారికి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, పేదలని కన్నబిడ్డల్లాగా చూసుకుంటామని అన్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్ను బెస్ట్ సిటీగా నిర్మిస్తామని తెలిపారు.