News March 13, 2025
HYDలో రేపు మద్యం దుకాణాలు బంద్: సీపీ

హోలీ పండుగను పురస్కరించుకొని ఈనెల 14వ తేదీ ఉ.6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి గుంపులు గుంపులుగా తిరుగుతూ.. హంగామా చేస్తే చర్యలు తప్పవని హెచ్చారించారు.
Similar News
News March 13, 2025
గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం: రేవంత్

TG: గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ చెప్పారు. తాను వారితో ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరో తెలియకుండానే PCC అధ్యక్షుడిగా, సీఎంగా ఎంపిక చేశారా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నిర్మల గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ అంశాలను పట్టించుకోవట్లేదని విమర్శించారు.
News March 13, 2025
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో నిత్య కళ్యాణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో గురువారం నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రోచ్ఛరణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి దర్శన భాగ్యం పొందారు. స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
News March 13, 2025
ఖమ్మం: హామీలన్నీ కాంగ్రెస్ సమర్థంగా అమలు చేస్తుంది: మువ్వా

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ సమర్థంగా అమలు చేస్తుందని TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబు అన్నారు. గురువారం ఆయన సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అండ అని, సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి సీఎం రేవంత్ ఆలోచన, లక్ష్యంతో ముందుకెళ్తున్నారన్నారు. గాదె సత్యం, బాణోత్ కాంతమ్మ కుటుంబాలను పరామర్శించారు.