News January 29, 2025

HZB: విద్యార్థిని ఆత్మహత్య

image

హనుమకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన సాయి చందన(21) ఈనెల 26న హాస్టల్లోని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. తోటి విద్యార్థులు, యాజమాన్యం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

Similar News

News February 13, 2025

KNR: ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

ఎలక్షన్ కమిషన్ నియమావళికి అనుగుణంగా ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎన్నికల విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అందించిన కరదీపిక లోని మార్గదర్శకాలు పాటించాలన్నారు.

News February 12, 2025

KNR: విద్యార్థుల్లో కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించాలి: కలెక్టర్

image

విద్యార్థులు దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని ఉపాధ్యాయుల గుర్తించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన హస్తకళ మేళా, సైన్స్ ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కస్తూర్బా బాలికల పాఠశాల, వివిధ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు తయారు చేసిన వివిధ కళాకృతులను పరిశీలించారు.

News February 12, 2025

కరీంనగర్: ప్రభుత్వ ఆసరా అందేనా?

image

ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా కొత్త పింఛన్లపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్హులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత BRS ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం 57 ఏళ్లకు ఆసరా పెన్షన్లు ఇస్తుందో.. లేదో అని ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

error: Content is protected !!