News September 17, 2024
నాక్కూడా CM కావాలనుంది: అజిత్ పవార్

CM పదవిపై NCP చీఫ్ అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి ఒక్కరూ తమ నాయకుడు CM కావాలని కోరుకుంటారు. నాకు కూడా ఆ కోరిక ఉంది. అయితే సీఎం అవ్వడానికి మెజారిటీ మార్క్ చేరుకోవాలి. ప్రతి ఒక్కరికి కోరుకున్నది దక్కదు. అయితే, దానికోసం అంబేడ్కర్ ఓటు హక్కును కల్పించారు. అంతిమంగా అది ఓటర్ల చేతిలోనే ఉంది. 288 మంది ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ 145 మార్క్ చేరుకోవాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
MHBD జిల్లాలో మహిళా ఓటర్లే అధికం!

MHBD, కేసముద్రం, మరిపెడ, తొర్రూర్, డోర్నకల్ మున్సిపాలిటీలు మినహా.. మిగిలిన 18 మండలాల్లో మొత్తం 5,56,780 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో మహిళలు 2,83,064 ఉండగా, 2,73,682 మంది పురుషులు, 24 మంది ఇతరులు ఉన్నట్లు తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 482 గ్రామపంచాయతీ, 4110 వార్డు స్థానాలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు కాగా.. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.
News November 28, 2025
అమ్మకానికి రెండు IPL జట్లు: హర్ష్ గోయెంకా

ఒకటి కాదు రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ‘ఆర్సీబీ మాత్రమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా అమ్మకానికి వస్తుందని నేను విన్నాను. వీటిని కొనుగోలు చేసేందుకు నలుగురు.. ఐదుగురు బయ్యర్స్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, USA ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి’ అని ట్వీట్ చేశారు.
News November 28, 2025
స్మృతితో పెళ్లిపై పలాశ్ తల్లి ఏమన్నారంటే..

స్మృతి మంధాన వివాహంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పలాశ్ ముచ్చల్ తల్లి అమృత స్పందించారు. త్వరలోనే పెళ్లి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆ రోజు జరిగిన పరిణామాలపై ఇద్దరూ బాధపడుతున్నారు. మ్యారేజ్ అవగానే స్మృతికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేశాం. అనుకోని పరిస్థితులతో వివాహం వాయిదా వేశాం’ అని చెప్పారు. కాగా పెళ్లి సంబంధిత పోస్టులను స్మృతి డిలీట్ చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.


