News June 2, 2024

అక్కడ ధ్యానం చేయడం నా అదృష్టం: మోదీ

image

భరతమాత పాదాల వద్ద కూర్చోని ధాన్యం చేయడం మర్చిపోలేని అనుభూతి అని ప్రధాని మోదీ అన్నారు. ‘కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ సందర్శించగానే అక్కడ ఏదో దివ్యశక్తి ఉన్నట్లు అనిపించింది. ఇక్కడే పార్వతీదేవి, స్వామి వివేకానంద తపస్సు చేశారు. ఇన్నేళ్ల తర్వాత ఈ పవిత్రమైన స్థానంలో ధాన్యం చేసుకునే అవకాశం రావడం నా అదృష్టం’ అని ఓ ఆయన రాసిన నోట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ Xలో షేర్ చేశారు.

Similar News

News October 12, 2024

నేటి నుంచి పాపికొండలు టూర్ స్టార్ట్

image

దసరా సందర్భంగా పర్యాటకులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి పాపికొండల్లో లాంచీల్లో విహరించేందుకు అధికారులు అనుమతిచ్చారు. వరదల కారణంగా ఐదు నెలల పాటు పాపికొండలు టూరిజంను నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితులు మెరుగవ్వడంతో లాంచీ యజమానుల విజ్ఞప్తుల మేరకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు.

News October 12, 2024

నవంబర్ 8 నుంచి DAO సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(DAO) ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు TGPSC కీలక అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో సెలక్ట్ చేశారు.

News October 12, 2024

పండగకు ఊరెళ్తున్న సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి వెళ్తున్న ఆయన అక్కడే దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేవంత్ కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోనున్నారు.