News December 29, 2024

నేను జనసేనలో చేరడం లేదు: తమ్మినేని సీతారాం

image

AP: తనకు జనసేనలో చేరాల్సిన అవసరం లేదని YCP నేత తమ్మినేని సీతారాం అన్నారు. ‘నేను పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవం. నా కుమారుడు ఆస్పత్రిలో ఉండటంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఆపండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తమ్మినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలసకు కొత్త ఇన్‌ఛార్జిని పెట్టడంతో పార్టీపై ఆయన గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Similar News

News November 28, 2025

సికిల్‌సెల్, తలసేమియా రోగుల కోసం ప్రత్యేక శిబిరాలు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్‌సెల్, తలసేమియా దీర్ఘకాలిక రక్త వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరాలను ఈ నెల 29న (శనివారం) ఉదయం 8 గంటలకు అశ్వారావుపేటలో, మధ్యాహ్నం 12:30 గంటలకు నారాయణపురంలోని రైతు వేదికల్లో నిర్వహించనున్నారు.. రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News November 28, 2025

సికిల్‌సెల్, తలసేమియా రోగుల కోసం ప్రత్యేక శిబిరాలు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్‌సెల్, తలసేమియా దీర్ఘకాలిక రక్త వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరాలను ఈ నెల 29న (శనివారం) ఉదయం 8 గంటలకు అశ్వారావుపేటలో, మధ్యాహ్నం 12:30 గంటలకు నారాయణపురంలోని రైతు వేదికల్లో నిర్వహించనున్నారు.. రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News November 28, 2025

నేడు కామారెడ్డికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న PDSU 23వ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరుకానున్నారు. PDSU జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లాలోని పీడీఎస్‌యూ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై, మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.