News November 28, 2024
‘నా చావుకు నేనే కారణం’.. పరీక్షల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య

AP: అనంతపురం మెడికల్ కాలేజీ హాస్టల్లో విషాదం చోటు చేసుకుంది. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక హాస్టల్ గదిలో మెడికో వీర రోహిత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోహిత్ ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ‘నా చావుకు నేనే కారణం. ఎవరూ బాధ్యులు కాదు. పరీక్షల ఒత్తిడిని భరించలేక చనిపోతున్నా. ఎగ్జామ్స్పై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా’ అని రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News November 25, 2025
కడప కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సప్ ఖాతా.. తస్మాత్ జాగ్రత్త

కడప కలెక్టర్ పేరు మీద నకిలీ నంబర్తో వాట్సప్ ఖాతాను సృష్టించి మోసాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు నమ్మవద్దని కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గుర్తుతెలియని వ్యక్తి కలెక్టర్ పేరుతో వాట్సప్ ఖాతాను క్రియేట్ చేసినట్లు తమ కార్యాలయ దృష్టికి వచ్చిందన్నారు. ఆ ఖాతా కలెక్టర్ది కాదని సృష్టం చేశారు. కలెక్టర్ ఫొటోలు వాడి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
News November 25, 2025
కడప కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సప్ ఖాతా.. తస్మాత్ జాగ్రత్త

కడప కలెక్టర్ పేరు మీద నకిలీ నంబర్తో వాట్సప్ ఖాతాను సృష్టించి మోసాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు నమ్మవద్దని కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గుర్తుతెలియని వ్యక్తి కలెక్టర్ పేరుతో వాట్సప్ ఖాతాను క్రియేట్ చేసినట్లు తమ కార్యాలయ దృష్టికి వచ్చిందన్నారు. ఆ ఖాతా కలెక్టర్ది కాదని సృష్టం చేశారు. కలెక్టర్ ఫొటోలు వాడి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
News November 25, 2025
హీరోల రెమ్యునరేషన్ తగ్గిస్తే టికెట్ రేట్లు ఎందుకు పెరుగుతాయ్?

సినిమా టికెట్ రేట్ల పెరుగుదలకు టాప్ హీరోల రెమ్యునరేషనే ప్రధాన కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అగ్ర హీరోలు ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు తీసుకుంటున్నారు. దీనివల్లే బడ్జెట్ పెరుగుతోందని, పెట్టిన డబ్బులు రాబట్టేందుకు నిర్మాతలు ప్రేక్షకులపై టికెట్ల భారం మోపుతున్నారని చెబుతున్నారు. అలాగే థియేటర్లలో స్నాక్స్ రేట్లను కంట్రోల్ చేయాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?


