News September 12, 2025
దేశంలో సీనియర్ మోస్ట్ లీడర్ నేనే: చంద్రబాబు

AP: 2028 నాటికి తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తవుతుందని చంద్రబాబు Way2News కాన్క్లేవ్లో అన్నారు. ‘పేదలను నిరంతరం ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేను 45 ఏళ్లుగా కష్టపడుతున్నాను. దేశంలో సీనియర్ మోస్ట్ లీడర్ నేనే. దేశం ముందుకెళ్లడానికి ఒక సుస్థిర ప్రభుత్వం రావాలి. సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నారంటే అది మోదీ గారే. తెలుగుజాతి అన్నింటిలో నంబర్ వన్గా ఉండాలన్నదే నా ఆకాంక్ష’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News March 10, 2026
కలుపు ముప్పు తగ్గాలంటే ఇలా చేయాలి

పంట వేసేందుకు పొలాన్ని 2 నుంచి 3 దఫాలుగా దున్నడం వల్ల తొలిదశలోనే కలుపు విత్తనాలు మెులిచి మున్ముందు కలుపు సమస్య అంతగా ఉండదు. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్స్, పంట వ్యర్థాలను, వరి గడ్డిని నేలపై చదునుగా పరచడం, అంతరకృషి వంటివి కలుపును తగ్గించి పంటకు, నేలకు మేలు చేస్తుందనే వాస్తవాన్ని రైతులు తెలుసుకోవాలి. కలుపు మందును వాడాల్సి వస్తే తప్పకుండా నిపుణులు సూచన మేరకే వాడాలి. వ్యాపారుల ప్రమేయం ఉండకపోవడం మంచిది.
News March 10, 2026
టీమ్ ఇండియాకు రూ.131 కోట్లు

T20WC సొంతం చేసుకున్న టీమ్ ఇండియాకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఏకంగా రూ.131 కోట్ల భారీ రివార్డు ప్రకటించింది. ఆటగాళ్లతోపాటు సపోర్ట్ స్టాఫ్, కోచింగ్ బృందానికి ఈ మొత్తాన్ని అందజేయనుంది. వరుసగా రెండుసార్లు, మొత్తం మూడు సార్లు ట్రోఫీని సాధించినందుకు కంగ్రాట్స్ చెప్పింది.
News March 10, 2026
గ్యాస్ నిల్వలు తగ్గకుండా కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చమురుశుద్ధి సంస్థలపై Essential Commodities Act ప్రయోగించింది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా, కృత్రిమ కొరత సృష్టించకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టింది. డొమెస్టిక్ గ్యాస్, ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. LPG ఉత్పత్తి పెంచాలని ఆయిల్ రిఫైనరీ కంపెనీలను ఆదేశించింది.


