News July 3, 2024
ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉండిపోయా: గంభీర్

తనకు 11 ఏళ్లు ఉన్నప్పుడు 1992WCలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలవ్వడంతో రాత్రంతా నిద్ర పట్టలేదని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెప్పారు. ఆ రోజు రాత్రంతా ఏడుస్తూ ఉండిపోయానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమయంలోనే భారత్ కోసం వన్డే WC సాధించాలని అనుకున్నానని, 2011లో కల నెరవేరిందని పేర్కొన్నారు. 2007 T20, 2011 వన్డే WCలు గెలవడంలో గంభీర్ ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 28, 2025
రోజుకు 30-35 లీటర్ల పాలు.. ఈ ఆవులతో డెయిరీఫామ్ మేలు

ప్రపంచంలోనే అత్యధికంగా పాలిచ్చే ఆవు జాతుల్లో హోలిస్టిన్ ఫ్రీజియన్ ఒకటి. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఒక ఈతలో 9వేల లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. ఇవి రోజుకు కనీసం 25-30 లీటర్లు, కొన్ని సందర్భాల్లో 35-40 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాలలో కొవ్వు 3.5%గా, ప్రొటీన్ 3.1%గా ఉంటుంది. ఈ రకం ఆవులతో డెయిరీఫామ్ నిర్వహణ మేలంటున్నారు వెటర్నరీ నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.
News November 28, 2025
అవసరమైతే కోర్టులో మూలన నిలబెట్టగలం.. రంగనాథ్పై HC తీవ్ర ఆగ్రహం

TG: అంబర్పేట బతుకమ్మ కుంట వ్యవహారంలో విచారణకు హాజరుకాకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్పై HC ఆగ్రహించింది. న్యాయస్థానం ఉత్తర్వులపై గౌరవం లేదా అని ప్రశ్నించింది. అవసరమైతే ఉ.10.30 గంటల నుంచి సా.4.30 గంటల వరకు కోర్టులో ఓ మూలన నిలబెడతామని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బతుకమ్మ కుంట భూవివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది.
News November 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 80

ఈరోజు ప్రశ్న: ఉప పాండవులను చంపింది ఎవరు? ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


