News July 3, 2024
ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉండిపోయా: గంభీర్

తనకు 11 ఏళ్లు ఉన్నప్పుడు 1992WCలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలవ్వడంతో రాత్రంతా నిద్ర పట్టలేదని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెప్పారు. ఆ రోజు రాత్రంతా ఏడుస్తూ ఉండిపోయానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమయంలోనే భారత్ కోసం వన్డే WC సాధించాలని అనుకున్నానని, 2011లో కల నెరవేరిందని పేర్కొన్నారు. 2007 T20, 2011 వన్డే WCలు గెలవడంలో గంభీర్ ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 8, 2025
సరసమైన ధరలున్నా.. BSNLవైపు మళ్లట్లేదు!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల రూ.485 ప్లాన్(72 రోజులు డైలీ 2GB డేటా) తీసుకొచ్చింది. ఇలాంటి ఎన్నో ప్లాన్స్ ఉన్నా యూజర్లు BSNLవైపు మళ్లట్లేదని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ప్రైవేట్ సంస్థలు 5G సేవలు అందిస్తుండగా BSNL ఇంకా 4Gకే పరిమితమైంది. డేటా స్పీడ్ తగ్గడం, కాల్ డ్రాప్స్, నెట్వర్క్ కవరేజ్ సమస్యల వల్లే ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తున్నారు’ అని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News December 8, 2025
మూవీ ముచ్చట్లు

✦ ఈ నెల 12నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాంత’
✦ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ నివేదా థామస్ సోదరుడు.. ‘బెంగళూరు మహానగరంలో బాలక’ సినిమాతో హీరోగా ఎంట్రీ.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్
✦ ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కానున్న అగస్త్య నరేశ్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘గుర్రం పాపిరెడ్డి’
News December 8, 2025
INDIGO… NAIDU MUST GO: అంబటి

AP: ఇండిగో సంక్షోభాన్ని ముందుగా కనిపెట్టడంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారని YCP నేత అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ‘INDIGO… NAIDU MUST GO!’ అంటూ రామ్మోహన్ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రామ్మోహన్ తెలుగువారి పరువు తీశారని మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా సుమారు 5వేల విమాన సర్వీసులు రద్దవ్వగా 8లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.


