News January 6, 2025
కేవీ రావుకు నేను ఫోన్ చేయలేదు.. కాల్ డేటా చూసుకోవచ్చు: VSR

కాకినాడ సీ పోర్ట్ షేర్ల వ్యవహారంలో తనకు సంబంధం లేదని YCP MP విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. HYDలో ఈడీ విచారణ అనంతరం ఆయన మాట్లాడారు. ‘KV రావుతో నాకు సంబంధం లేదు. 2020 మేలో నేను ఫోన్ చేశానని ఆయన చెబుతున్నారు. కాల్ డేటాతో చెక్ చేసుకోవచ్చు. సీపోర్ట్ విషయంలో నేనెవరికీ ఫోన్ చేయలేదు. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కేవీ రావు తిరుపతికి వచ్చి దేవుడు ముందు నిజాలు చెప్పాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News December 22, 2025
HALలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<
News December 22, 2025
తీర్థం తీసుకున్న చేతిని తలపై రాసుకోవచ్చా?

తీర్థం స్వీకరించాక కొందరు చేతిని తలపై రాసుకుంటారు. అలా చేయడం శాస్త్రసమ్మతం కాదంటున్నారు పండితులు. తీర్థం తాగినప్పుడు మన చేయి ఎంగిలి అవుతుంది. దాన్ని శిరస్సుపై రాసుకోవడం అశుభంగా పరిగణిస్తారు. అలాగే పంచామృత తీర్థంలోని చక్కెర, తేనె జుట్టుకు తగిలితే నష్టం కలగవచ్చు. తీర్థం తీసుకున్నాక చేతిని రుమాలుతో తుడుచుకోవాలి. నీటితో కడుక్కోవడం మరింత ఉత్తమం. అయితే గంగాజల అభిషేక తీర్థాన్ని మాత్రం తలపై జల్లుకోవచ్చు.
News December 22, 2025
జ్వరంతో ఉన్నప్పుడు పిల్లలకు ఇవి పెట్టకూడదు

పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వేయించిన పదార్థాలు, బజ్జీలు, పకోడీలు, చిప్స్ వంటివి పెట్టకూడదు. ఇవి త్వరగా జీర్ణం కావు, కడుపునొప్పి, అజీర్తి కలిగిస్తాయంటున్నారు నిపుణులు. అలాగే చాక్లెట్స్, కేక్, జ్యూస్ వంటి తీపి పదార్థాలు కూడా తగ్గించాలి. షుగర్ ఎక్కువ ఉన్న ఆహారం శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగడానికి, ఇమ్యూనిటీ తగ్గడానికి కారణం అవుతుంది. ప్యాక్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇవ్వకూడదని చెబుతున్నారు.


