News April 5, 2024
నా పెళ్లిపై ట్రోల్స్ పట్టించుకోను: దిల్ రాజు
తన పెళ్లిపై వచ్చిన ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్ పట్టించుకోనని నిర్మాత దిల్ రాజు అన్నారు. ‘నా పెళ్లి తర్వాత ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ వీడియోపై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ నా భార్య చూసి నాకు చెప్పింది. నన్ను గుర్తుపట్టేవారు కోటి మంది ఉంటే.. విమర్శించేవారు పది వేల మంది కూడా ఉండరు. నేను ఆకాశం లాంటి వాడిని.. మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి.. ఆ తర్వాత ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 8, 2024
తాజ్మహల్ అందం.. మాటల్లో చెప్పలేం: ముయిజ్జు
భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తాజాగా తాజ్మహల్ను సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆ కట్టడం అందానికి ముగ్ధుడయ్యారు. ‘ఈ సమాధి మందిర అందాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ప్రేమకు, నిర్మాణ నైపుణ్య పరాకాష్ఠకు ఇది సజీవ సాక్ష్యం’ అని విజిటర్ బుక్లో రాశారు. భారత్లో 4 రోజుల టూర్లో భాగంగా ఆయన నేడు ముంబై, రేపు బెంగళూరులో పర్యటించనున్నారు.
News October 8, 2024
ఆ కాఫీ ధర రూ.335.. అందులో బొద్దింక!
ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో లోపెరా బేకరీలో ఓ కస్టమర్ రూ.335 ఖరీదైన ఐస్డ్ లాటే ఆర్డర్ ఇచ్చారు. తాగే సమయంలో ఏదో కాఫీ గింజలా తేలుతుండటంతో స్పూన్తో వెనక్కి తిప్పారు. తీరా చూస్తే అది బొద్దింక. ఈ విషయాన్ని ఆమె రెడిట్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. ఆమెకు క్షమాపణలు చెప్పి, డబ్బులు వెనక్కిచ్చామని, మరో కాఫీ ఆఫర్ చేశామని బేకరీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మరో కాఫీ తాగేందుకు ఆ కస్టమర్ సాహసించలేదు.
News October 8, 2024
శతక్కొట్టిన సల్మాన్.. పాక్ భారీ స్కోర్
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో పాకిస్థాన్ బ్యాటర్ అఘా సల్మాన్ విధ్వంసం సృష్టించారు. 108 బంతుల్లోనే సల్మాన్ (100*) సెంచరీ బాదారు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అంతకుముందు అబ్దుల్లా షఫీఖ్ (102), షాన్ మసూద్ (151) కూడా సెంచరీలు చేయడంతో పాక్ 556 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 3 వికెట్లు పడగొట్టారు.