News September 24, 2024
నాకు యూట్యూబ్ ఛానల్ లేదు: రోజా
AP: తాను సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉండటానికి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్, థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నానని మాజీ మంత్రి రోజా చెప్పారు. తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని స్పష్టం చేశారు. తన పేరుతో ఉన్న ఫేక్ ఛానళ్లను డిలీట్ చేయాలని హెచ్చరించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. తన పేరుతో బ్లూటిక్ ఉన్న అకౌంట్లను మాత్రమే ఫాలో కావాలని సూచించారు.
Similar News
News September 24, 2024
జగన్.. తిరుమల అంటే ద్వేషం ఎందుకు?: టీడీపీ
AP:తిరుమల అంటే ఎందుకంత ద్వేషమంటూ మాజీ సీఎం జగన్పై TDP Xలో ప్రశ్నల వర్షం కురిపించింది. ‘దోపిడీ చేయడానికే నీ బంధువులను TTD ఈవో, ఛైర్మన్లుగా పెట్టావా? భక్తులను స్వామివారికి దూరం చేయడానికే ధరలు పెంచావా? కమీషన్ల కోసమే నందిని నెయ్యి సరఫరాను ఆపేశావా? నెయ్యి సప్లైలో నిబంధనలు ఎందుకు మార్చావ్? రూ.320కే కేజీ స్వచ్ఛమైన నెయ్యి ఎలా వస్తుందని అప్రూవ్ చేశావు? కోర్టుకు ఎందుకు వెళ్లావు?’ అని ప్రశ్నించింది.
News September 24, 2024
అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దు: హైడ్రా
TG: బఫర్ జోన్, FTL పరిధిలో అక్రమ నిర్మాణాల కట్టడికి హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దని ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులకు లేఖ రాసింది. రెండు రోజుల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాంకర్లతో సమావేశమై సూచనలు చేయనున్నారు. దీని కోసం ఒక లీగల్ టీమ్ను ఏర్పాటు చేశారు. ఇటీవల కూల్చిన అక్రమ కట్టడాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల లిస్టును సిద్ధం చేశారు.
News September 24, 2024
లెబనాన్లో 558కి పెరిగిన మృతుల సంఖ్య
హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్పై 2 రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో మృతుల సంఖ్య 558కి పెరిగింది. ఈ మేరకు లెబనీస్ ఆరోగ్య శాఖ తెలిపింది. లెబనాన్ సరిహద్దుల నుంచి హెజ్బొల్లాను తరిమేందుకు అవసరమైనదంతా చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై జరిపిన దాడుల్లో ఏడుగురు మృతిచెందారు. వరుస దాడులతో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ అదృశ్యమయ్యాడు. అతని జాడ కోసం ఇజ్రాయెల్ వెతుకుతోంది.