News January 22, 2025
ఎలా ఆడాలో రోహిత్కు చెప్పక్కర్లేదు: రహానే

రోహిత్ శర్మ పదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడబోతున్నారు. రేపు J&Kతో మ్యాచ్లో ముంబై తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా ముంబై కెప్టెన్ రహానే మాట్లాడుతూ ‘రోహిత్ ఏంటో అందరికీ తెలుసు. నేషనల్, ఇంటర్నేషనల్ ఏ మ్యాచ్ ఆడినా ఒకేలా ఉంటాడు. ఆట గురించి అతనికి బాగా తెలుసు. ఏం చేయాలో ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదు. అతడిచ్చే ఇన్ పుట్స్ మాకు చాలా ముఖ్యం. రోహిత్ తిరిగి ఫామ్లోకి వస్తాడనే నమ్మకముంది’ అని చెప్పారు.
Similar News
News November 24, 2025
INDvsSA.. భారమంతా బ్యాటర్లపైనే!

IND, SA మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో నేడు మూడో రోజు ఆట కీలకం కానుంది. భారత్ విజయావకాశాలపై ఈరోజు ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. తొలి ఇన్నింగ్స్లో SA భారీ స్కోర్(489) చేయడంతో IND బ్యాటర్ల బాధ్యత మరింత పెరిగింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలంటే బ్యాటర్లు సమష్ఠిగా రాణించాల్సిన అవసరముంది. ఈ ఇన్నింగ్స్లో ఓపెనర్ జైస్వాల్ కీలకంగా మారతారని అనిల్ కుంబ్లే అన్నారు. ప్రస్తుతం IND 480 రన్స్ వెనుకబడి ఉంది.
News November 24, 2025
ఫ్రీగా సివిల్స్ కోచింగ్.. దరఖాస్తులకు 3 రోజులే ఛాన్స్

AP: UPSC సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష-2026కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఫ్రీ కోచింగ్ అందిస్తోంది. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షలు మించకూడదు. ఈ నెల 26లోగా అప్లై చేసుకోవాలి. NOV 30న జరిగే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. DEC 10 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. 340 సీట్లు ఉన్నాయి. పూర్తి వివరాలు, దరఖాస్తుకు ఇక్కడ <
News November 24, 2025
హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్ హతం: IDF

హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్ హయతం అలీ తబతబాయిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. బీరూట్లో జరిపిన దాడుల్లో అతడు మరణించినట్లు పేర్కొంది. 1980లో హెజ్బొల్లాలో చేరిన తబతబాయి సిరియా ఆపరేషన్స్కు హెడ్గా, రాడ్వన్ ఫోర్స్కు కమాండర్గా పనిచేశాడని తెలిపింది. హెజ్బొల్లా గ్రూప్లో ఇతడు నంబర్ 2 లీడర్ అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ దాడుల్లో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు సమాచారం.


