News July 20, 2024
వారికెందుకు చోటు దక్కలేదో అర్థం కావట్లేదు: భజ్జీ

శ్రీలంక టూర్కు అభిషేక్ శర్మ, చాహల్ను అసలు ఎంపిక చేయకపోవడం, సంజూ శాంసన్ను టీ20లకు మాత్రమే ఎంపిక చేయడం పట్ల హర్భజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘చాహల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఎందుకు లేరు? నాకు అసలు అర్థం కావడం లేదు’ అని ట్వీట్ చేశారు. తన రెండో T20I మ్యాచ్లోనే అభిషేక్ 100 బాదగా, సంజూ సైతం తన చివరి వన్డేలో సెంచరీ చేశారు. అటు చాహల్ ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన కనబరిచారు.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


