News October 25, 2024
షర్మిలతో పాదయాత్ర వద్దన్నా: పేర్ని నాని

AP: పీసీసీ చీఫ్ షర్మిల తాపత్రయమంతా వైఎస్ ఆస్తి కోసమేనని, వైఎస్ ఆశయాల కోసం కాదని వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. వైఎస్ శత్రువులతో షర్మిల చేతులు కలిపారని విమర్శించారు. ‘షర్మిలను పాదయాత్ర చేయనీయొద్దని అప్పట్లోనే జగన్కు చెప్పా. కానీ ఆయన వినలేదు. ఏరోజైనా ఆమెతో చికాకులు తప్పవని అప్పుడే ఆయనను హెచ్చరించా. నేను అప్పుడు అనుమానించినవే ఇప్పుడు జరుగుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 7, 2025
ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’ పేరు.. సీఎం నిర్ణయం

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో సీఎం రేవంత్ వినూత్న ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను HYD ప్రధాన రోడ్లకు పెట్టాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’, అమెరికన్ కాన్సులేట్ రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ పేర్లను పెట్టనున్నారు. అలాగే పలు కీలక రోడ్లకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను పరిశీలిస్తున్నారు.
News December 7, 2025
బెంగళూరులోనే IPL మ్యాచ్లు: డీకే

చిన్నస్వామి స్టేడియం నుంచి IPL మ్యాచ్లను తరలించడానికి అనుమతించేది లేదని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ‘ఇది కర్ణాటక, బెంగళూరు గౌరవానికి సంబంధించిన విషయం. భవిష్యత్తులో తొక్కిసలాటలు జరగకుండా చూస్తాం. కొత్త క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తాం’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ ఏడాది విజయోత్సవ ర్యాలీలో 11 మంది చనిపోయిన నేపథ్యంలో IPL మ్యాచ్లను పుణేకు షిఫ్ట్ చేసేందుకు RCB <<18265735>>ప్రయత్నిస్తోంది.<<>>
News December 7, 2025
బోర్లు ఇంటికి ఏ దిశలో ఉండాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. బోర్లు ఇంటి ప్రాంగణంలో తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్య దిశలో ఉండటం శ్రేయస్కరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అలా సాధ్యంకాని పక్షంలో కనీసం తూర్పు, ఉత్తర దిక్కులలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు. ఈ నియమాలు పాటించేవారికి అదృష్టం, అభివృద్ధి, సంపద, ఆరోగ్యం వంటి శుభ ఫలితాలు కలుగుతాయని, వాస్తుకు సంబంధించి దోషాలు కలగవని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


