News October 25, 2024

షర్మిలతో పాదయాత్ర వద్దన్నా: పేర్ని నాని

image

AP: పీసీసీ చీఫ్ షర్మిల తాపత్రయమంతా వైఎస్ ఆస్తి కోసమేనని, వైఎస్ ఆశయాల కోసం కాదని వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. వైఎస్ శత్రువులతో షర్మిల చేతులు కలిపారని విమర్శించారు. ‘షర్మిలను పాదయాత్ర చేయనీయొద్దని అప్పట్లోనే జగన్‌కు చెప్పా. కానీ ఆయన వినలేదు. ఏరోజైనా ఆమెతో చికాకులు తప్పవని అప్పుడే ఆయనను హెచ్చరించా. నేను అప్పుడు అనుమానించినవే ఇప్పుడు జరుగుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 8, 2025

10ఏళ్లలో రూ.కోటి విలువ రూ.55లక్షలే!

image

మీరు దాచుకున్న డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుందనే విషయం మీకు తెలుసా? మీ దగ్గర రూ.కోటి ఉంటే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం(6%) కొనసాగితే మరో పదేళ్లలో అది ₹55.8 లక్షలకు చేరనుంది. 2045లో రూ.31.18లక్షలు, 2075నాటికి ₹కోటి విలువ రూ.5.4లక్షలకు పడిపోనుంది. అందుకే డబ్బును పొదుపు చేయడంతో పాటు సంపద విలువను కాపాడుకోవడానికి పెట్టుబడి పెట్టడం అలవర్చుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

News December 8, 2025

కేంద్ర ఉద్యోగులకు వేతన సవరణ ఆలస్యమేనా!

image

7వ PRC గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. 2026 JAN నుంచి 8వ PRC అమలు కావాలి. ఈ కమిషన్‌ను కేంద్రం ఈ ఏడాది JANలో వేసినా టర్మ్స్‌ను NOVలో కానీ ప్రకటించలేదు. కాగా PRCపై LSలో MPలు ప్రశ్నించగా ‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటినుంచి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కమిషన్ నివేదికకు 18 నెలల సమయం పడుతుంది’ అని మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దీంతో కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్న PRC అమలు ఆలస్యం కావొచ్చంటున్నారు.

News December 8, 2025

ఆ రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!

image

TGలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ నెల 11,14,17 తేదీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. తొలి విడతలో 4,236, రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం గ్రామాల్లోని స్కూళ్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 14న ఆదివారం కాగా 11,17న పోలింగ్ జరిగే స్కూళ్లకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే ప్రకటన రావచ్చు.