News October 25, 2024

షర్మిలతో పాదయాత్ర వద్దన్నా: పేర్ని నాని

image

AP: పీసీసీ చీఫ్ షర్మిల తాపత్రయమంతా వైఎస్ ఆస్తి కోసమేనని, వైఎస్ ఆశయాల కోసం కాదని వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. వైఎస్ శత్రువులతో షర్మిల చేతులు కలిపారని విమర్శించారు. ‘షర్మిలను పాదయాత్ర చేయనీయొద్దని అప్పట్లోనే జగన్‌కు చెప్పా. కానీ ఆయన వినలేదు. ఏరోజైనా ఆమెతో చికాకులు తప్పవని అప్పుడే ఆయనను హెచ్చరించా. నేను అప్పుడు అనుమానించినవే ఇప్పుడు జరుగుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 17, 2025

2035 నాటికి ఇండియా స్పేస్ స్టేషన్ రెడీ: ఇస్రో

image

మన సొంత స్పేస్ స్టేషన్ కల 2035 నాటికి నెరవేరనుంది. దీని ఇనిషియల్ మాడ్యూల్స్‌ 2027 నుంచి ఇన్‌స్టాల్ చేస్తామని ISRO ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ’చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌ సక్సెస్‌‌తో దాని తదుపరి ప్రాజెక్టును కొనసాగిస్తున్నాం. గగన్‌యాన్-3 కూడా రెడీ అవుతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో స్వయం సమృద్ధితో ముందుకెళ్తున్నాం. టెలికాం, వెదర్, డిజాస్టర్ ఇలా అనేకరకాల మేలు జరుగుతోంది’ అని అన్నారు.

News October 17, 2025

16 నెలల్లో ₹లక్ష కోట్లకు పైగా సంక్షేమం, అభివృద్ధి: చంద్రబాబు

image

AP: గత 16 నెలల్లో ₹లక్ష కోట్లకు పైగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని CM CBN తెలిపారు. 2047కి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అందులో భాగమే ‘P4 జీరో పావర్టీ’ అని వివరించారు. NTR భరోసా, అన్న క్యాంటీన్లు, దీపం-2, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని చెప్పారు. పేదరిక నిర్మూలన దినం సందర్భంగా అందరూ పీ4లో భాగస్వాములు కావాలని కోరారు.

News October 17, 2025

మునగ సాగుకు ప్రభుత్వ సబ్సిడీలు ఇలా..

image

AP: మునగ సాగును ఉపాధి హామీ పథకానికి ప్రభుత్వం అనుసంధానించింది. గుంతలు తీయడం, మొక్కలు నాటడం, నీరు పెట్టడానికి డబ్బు చెల్లిస్తుంది. 25సెంట్లలో నాటితే రెండేళ్లలో ₹38,125, 50 సెంట్లకు ₹75,148, 75 సెంట్లకు ₹1.25L, ఎకరాకు ₹1.49L ఆర్థిక భరోసా ఉంటుంది. ఈ ఏడాది 12 జిల్లాల్లో(అన్నమయ్య, అనంతపురం, అనకాపల్లి, బాపట్ల, చిత్తూరు, నంద్యాల, గుంటూరు, ప్రకాశం, సత్యసాయి, శ్రీకాకుళం, పల్నాడు, తిరుపతి) అమలు చేస్తోంది.