News March 10, 2025
ఉద్యమకారిణిగా నాకు అవకాశం వచ్చింది: విజయశాంతి

TG: MLC పదవి అడుక్కోవడానికి బిచ్చగాళ్లం కాదని, ఉద్యమకారిణిగా తనకు కాంగ్రెస్ ఆ పదవి ఇచ్చిందని విజయశాంతి వెల్లడించారు. ‘మేమే అసలైన ఉద్యమకారులం. KCRను ఓడించేందుకు BJP గతంలో నన్ను ఆహ్వానించింది. కానీ BJP-BRS మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది. అందుకే కమలం పార్టీ నుంచి బయటకు వచ్చాను. BC మహిళా నేతగా నన్ను కాంగ్రెస్లో గుర్తించారు. క్యాబినెట్లోకి తీసుకోవడం అనేది పార్టీ నిర్ణయిస్తుంది’ అని ఆమె చెప్పారు.
Similar News
News March 10, 2025
విశాఖలో ‘హయగ్రీవ’ భూములు వెనక్కి

AP: విశాఖలో హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్కు ఇచ్చిన 12.41 ఎకరాల భూ కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతూ సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ను ఆదేశించింది. అటు అమరావతిలోనూ 13 సంస్థల భూ కేటాయింపులను రద్దు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ <<15713685>>నిర్ణయించిన<<>> విషయం తెలిసిందే.
News March 10, 2025
మరో అమ్మాయితో చాహల్.. ధనశ్రీ సంచలన పోస్ట్

టీమ్ ఇండియా క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మహిళను బ్లేమ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. దీంతో SMలో తనపై వచ్చిన కామెంట్స్పై ధనశ్రీ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. అటు నిన్న CT ఫైనల్ మ్యాచ్కు <<15704215>>చాహల్<<>> మరో అమ్మాయితో కలిసి వెళ్లిన వీడియోలు వైరల్ అయ్యాయి.
News March 10, 2025
ALERT.. నోటిఫికేషన్ విడుదల

AP: ECET-2025 నోటిఫికేషన్ను JNTU అనంతపురం విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 7వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా డిప్లొమా చదువుతున్న వారు ఇంజినీరింగ్, ఫార్మసీ సెకండియర్ సహా మరికొన్ని కోర్సుల్లో చేరవచ్చు. మే 6వ తేదీన ఉ.9-12 వరకు, మ.2-5 వరకు పరీక్ష జరుగుతుంది.