News September 9, 2024
నాకు యాక్సిడెంట్ అయింది.. కోలుకుంటున్నా: రష్మిక

తనకు ఇటీవల యాక్సిడెంట్ అయిందని నటి రష్మిక ఇన్స్టాలో వెల్లడించారు. ‘నెలరోజులుగా నేను యాక్టివ్గా లేను. ఓ చిన్న ప్రమాదం జరగడమే అందుకు కారణం. వైద్యుల సూచన మేరకు ఇంటివద్దే ఉంటున్నా. త్వరలోనే మళ్లీ బిజీ అవుతా. జీవితం చాలా విలువైనది. జాగ్రత్తగా ఉండండి. రేపనేది ఉంటుందో లేదో తెలీదు. హ్యాపీగా జీవించండి’ అని పేర్కొన్నారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News January 18, 2026
పితృ దేవతల అనుగ్రహం కోసం ఇలా చేయండి!

పితృ దోషాలు, పూర్వీకుల అనుగ్రహం పొందేందుకు మౌని అమావాస్య ఎంతో ప్రాముఖ్యమైందని పండితులు చెబుతున్నారు. ‘ఉదయాన్నే లేచి నదీ స్నానం ఆచరించాలి. ఉపవాసం ఉంటూ, మౌనవ్రతం పాటించాలి. జాతకంలో పితృ దోషాలు ఉన్నవారు నల్ల నువ్వులతో తర్పణం వదలాలి. పేదలకు అన్నదానం, వస్త్ర దానం, పెరుగు దానం చేస్తే పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది. పండితుడికి బూడిద గుమ్మడికాయ దానం చేయడం మంచిది’ అని సూచిస్తున్నారు.
News January 18, 2026
డెయిరీఫామ్ కోసం పశువులను కొంటున్నారా?

డెయిరీఫామ్ నిర్వహణలో భాగంగా ఆవులు, గేదెలను కొనుగోలు చేసి పాడి రైతులు, పెంపకందారులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్తుంటారు. ఇలా తరలించేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాలి. లేకుంటే వాటి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అలాగే కొన్ని పత్రాలను కూడా కొనుగోలుదారులు కలిగి ఉండాలి. ఆ పత్రాల వివరాలు, జీవాల తరలింపులో జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 18, 2026
అంగన్వాడీల్లో అల్పాహారం.. వచ్చే నెలలో ప్రారంభం

TG: అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టీజీ ఫుడ్స్ ద్వారా కిచిడీ, ఉప్మా వంటి టిఫిన్స్ను పిల్లలకు అందించనుంది. తొలుత హైదరాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల పరిధిలో ఉన్న 970 కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత లోటుపాట్లను సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా 35,781 కేంద్రాల్లో అమలు చేయనున్నట్లు సమాచారం.


