News October 10, 2024

దువ్వాడతో నాది పవిత్ర బంధం: మాధురి

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో తనది పవిత్ర బంధం అని దివ్వెల మాధురి చెప్పారు. ప్రజలు తమ మధ్య సంబంధాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ప్రజా జీవితం వేరు.. రాజకీయాలు వేరు. రెండింటికీ ముడి పెట్టొద్దు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ది తప్పు కాకపోతే మాదీ తప్పు కాదు. ఇక్కడ ఎవరూ రాముడిలాగా ఏకపత్నీవ్రతులు లేరు’ అని ఆమె చెప్పుకొచ్చారు.

Similar News

News January 21, 2026

కేంద్రం కీలక నిర్ణయం.. రైతులకు లాభం

image

నకిలీ, నాణ్యత లేని పురుగు మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే వీటి తయారీ, విక్రయంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైంది. దీని కోసం ‘పురుగుమందుల నిర్వహణ బిల్లు, 2025’ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం నకిలీ పురుగు మందులను విక్రయిస్తే రూ.50 లక్షల వరకు జరిమానా, 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్సుంది. కేంద్రం నిర్ణయంలో కీలక అంశాలను తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.

News January 21, 2026

ఆర్గానిక్ పంటల సర్టిఫికేషన్‌కు యాప్: తుమ్మల

image

TG: ఐదు జిల్లాల్లో అమలు చేసిన యూరియా యాప్‌ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం ఈ విధానాన్ని మెచ్చుకుందన్నారు. నకిలీ ఆర్గానిక్ లేబుళ్లతో చలామణి అవుతున్న ఫేక్ ప్రొడక్ట్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చేలా ఓ యాప్ తీసుకొస్తామని చెప్పారు. దీంతో పంటను ఎక్కడ, ఎలా పండించారనే వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

News January 21, 2026

పురుగు మందుల తయారీదారులకు కఠిన నిబంధనలు

image

కేంద్రం తీసుకురానున్న నూతన చట్టం ప్రకారం ప్రతి డబ్బాపై పురుగు మందు పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీతో పాటు తయారీ సంస్థ చిరునామా, అందులో వాడిన రసాయనాల వివరాలను తప్పనిసరిగా ముద్రించాలి. ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించడంతో పాటు, QR కోడ్ ముద్రించి రైతులకు ఆ మందుల వివరాలు ఈజీగా తెలుసుకునేలా చేయాలి. లైసెన్స్ ఉన్న ప్రాంగణాల్లో మాత్రమే ఉత్పత్తి జరగాలి. భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు.