News September 22, 2024

శ్రీవారితో నాకు ప్రత్యేక అనుబంధం: చంద్రబాబు

image

TG: తిరుమల శ్రీవారు తనకు పునర్జన్మ ప్రసాదించారని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీనివాసుడితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. ‘గతంలో వైఎస్‌ఆర్ ఏడు కొండలను రెండే కొండలు అన్నారు. వైసీపీ హయాంలో కొండపై అపవిత్ర కార్యక్రమాలు జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తిరుమల లడ్డూను కూడా గత ప్రభుత్వం అపవిత్రం చేసింది. కానీ తమ ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News December 30, 2025

పాన్-ఆధార్ లింక్.. రేపే లాస్ట్ డేట్

image

పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువు రేపటితో(DEC 31) ముగియనుంది. లింక్ చేసేందుకు IT <>ఈ-ఫైలింగ్<<>> పోర్టల్‌కి వెళ్లి ‘లింక్ ఆధార్’ క్లిక్ చేసి వివరాలు, OTP ఎంటర్ చేయాలి. మినిమం ఫీజు పే చేశాక మళ్లీ ‘లింక్ ఆధార్’లో డీటెయిల్స్, OTP వెరిఫై చేస్తే పాన్, ఆధార్ లింక్ అవుతాయి. గడువు ముగిసిన తర్వాత ఆధార్‌తో లింక్ కాని పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి. మళ్లీ యాక్టివేట్ చేయాలంటే రూ.1000 చెల్లించాల్సిందే.

News December 30, 2025

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి హత్య

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. మైమెన్సింగ్ జిల్లాలోని వాలుకా ప్రాంతంలోని ఓ దుస్తుల కర్మాగారంలో పని చేస్తున్న హిందూ కార్మికుడు బజేంద్ర బిస్వాస్ హత్యకు గురయ్యారు. సహోద్యోగి నోమన్ మియా షాట్‌గన్‌తో కాల్చగా అది బిస్వాస్ తొడకు తగలడంతో తీవ్ర గాయాలైనట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలోపు మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

News December 30, 2025

‘SIR’ పెద్ద స్కామ్: మమతా బెనర్జీ

image

పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంకురా జిల్లా బిర్సింగ్‌పూర్‌ ర్యాలీలో మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. AIతో నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ పెద్ద మోసమని, భారీగా ఓటర్ల పేర్లు తొలగించే యత్నం జరుగుతోందన్నారు. అర్హుడైన ఒక్క ఓటర్ పేరు తొలగించినా ఢిల్లీలోని EC కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.