News September 22, 2024

శ్రీవారితో నాకు ప్రత్యేక అనుబంధం: చంద్రబాబు

image

TG: తిరుమల శ్రీవారు తనకు పునర్జన్మ ప్రసాదించారని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీనివాసుడితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. ‘గతంలో వైఎస్‌ఆర్ ఏడు కొండలను రెండే కొండలు అన్నారు. వైసీపీ హయాంలో కొండపై అపవిత్ర కార్యక్రమాలు జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తిరుమల లడ్డూను కూడా గత ప్రభుత్వం అపవిత్రం చేసింది. కానీ తమ ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News December 31, 2025

అయామ్ సెమనీ కోడికి ఎందుకు అంత ధర?

image

అయామ్ సెమనీ కోడి ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కనిపిస్తుంది. ఈ కోడి చర్మం, మాంసం, ఎముకలు, అవయవాలు, ఈకలు అన్నీ నలుపే. రక్తం ముదురు ఎరుపుగా ఉంటుంది. గుడ్లు మాత్రం బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. వాతావరణ పరిస్థితులు, జన్యు మార్పుల వల్ల సెమనీ కోళ్లకు ఈ రంగు వచ్చింది. ఇండోనేషియా ప్రజలు ఈ కోడిని పవిత్రమైనదిగా, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నదిగా నమ్ముతారు. ఈ సెంటిమెంట్ వల్లే ఈ కోడి ధర కిలో రూ.2 లక్షలకు పైనే ఉంటుంది.

News December 31, 2025

మహిళలకు అత్యంత అనుకూలమైన దేశం డెన్మార్క్‌

image

ఉమెన్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ (WPS) ఇండెక్స్‌-2025లో మహిళలకు అత్యంత అనుకూలమైన దేశంగా డెన్మార్క్‌ అగ్ర స్థానంలో నిలిచింది. ఉద్యోగ, ఉపాధితోపాటు ప్రతి రంగంలోనూ ఇక్కడి మహిళలకు విస్తృతమైన అవకాశాలు, భద్రత లభిస్తోంది. లింగవివక్ష, మహిళలపై హింస ఉండవు. కీలక నిర్ణయాల్లో మహిళల ప్రాతినిధ్యం, బలమైన చట్టాలు, సురక్షిత వాతావరణం, ఆరోగ్యం-చదువులో ఉన్నత ఫలితాలు సాధించడం వంటివి దీన్ని లెక్కించే సూచికలు.

News December 31, 2025

కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా!

image

TG: గత సీజన్‌లో ఇచ్చినట్లుగానే ఈసారి కోటిన్నర ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కింద సంక్రాంతి నాటికి రైతు భరోసా నగదు రైతు ఖాతాల్లో జమ చేసే యోచనలో ఉంది. సాగు భూములకు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటికీ ఆ లెక్కలు తేలలేదు. ఈ పథకం ద్వారా ఎకరానికి రూ.6వేల చొప్పున ఏడాదికి రెండు విడతల్లో నగదు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.