News June 20, 2024
బెంగాల్ రాజ్భవన్లో నాకు సేఫ్టీ లేదు: గవర్నర్

పశ్చిమ బెంగాల్ రాజ్భవన్లో తనకు రక్షణ లేదని ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఆందోళన వ్యక్తం చేశారు. తన కార్యాలయంలో పూర్తిగా బెంగాల్ పోలీసులే మోహరించి ఉన్నారని పేర్కొన్నారు. ‘ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న అధికారి, అతడి బృందం నుంచి నాకు ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని సీఎం మమతకు కూడా చెప్పాను. అయినా అటునుంచి ఎటువంటి స్పందనా లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News September 15, 2025
MBBS అడ్మిషన్స్.. మెరిట్ లిస్ట్ రిలీజ్

TG: MBBS కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఇక్కడ <
News September 15, 2025
ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం: జగన్

AP: 1923 – 2019 వరకు రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలుంటే, తమ హయాంలో 17 కాలేజీలను సంకల్పించామని YCP చీఫ్ జగన్ అన్నారు. ‘2023 SEP 15న VZM, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ప్రారంభించాం. పాడేరు, పులివెందుల కళాశాలలను అడ్మిషన్లకు సిద్ధం చేశాం. మిగతా కాలేజీల పనులు చేయకుండా వాటిని ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం. ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలి’ అని ట్వీట్ చేశారు.
News September 15, 2025
వేధింపులతో ఉద్యోగి సూసైడ్.. రూ.90 కోట్ల పరిహారం

జపాన్లో వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఓ ఉద్యోగినికి కోర్టు రూ.90 కోట్ల పరిహారం ప్రకటించింది. 2023లో సతోమి(25)కి వర్క్ ప్లేస్లో వేధింపులు ఎదురయ్యాయి. 2021లో ఆ కంపెనీ ప్రెసిడెంట్ బాధిత యువతిని ‘వీధి కుక్క’ అని తిట్టారు. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిన ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారు. 2023లో మరణించారు. ఆమె మరణంపై యువతి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా రూ.90 కోట్లు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.