News January 25, 2025
కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం ఇష్టం: శార్దూల్

జమ్మూకశ్మీర్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ముంబై ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడుతూ ‘సాధారణ పరిస్థితుల్లో ఎవరైనా రాణిస్తారు. ప్రతికూల సమయాల్లో ఎలా ఆడామనేదే ముఖ్యం. నాకు కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం ఇష్టం. అలాంటి వాటిని సవాలుగా తీసుకొని ఎలా అధిగమించాలో ఆలోచిస్తా’ అని అన్నారు. శార్దూల్ రాణించడంతో ముంబై జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది.
Similar News
News November 14, 2025
₹11,399 కోట్లతో 419 రోడ్ల విస్తరణ, అభివృద్ధి

TG: హ్యామ్ విధానంలో 419 రోడ్ల విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయించింది. ₹11,399.33 కోట్లతో 5824 KM మేర రహదారులను తీర్చిదిద్దనుంది. ఫేజ్1లో నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ, సిద్దిపేట, కుమరంభీం జిల్లాల్లోని 30 రోడ్ల అభివృద్ధికి ఉత్తర్వులిచ్చింది. కాగా గతంలో అనుమతులిచ్చిన 7 రోడ్లను ఫేజ్1 నుంచి తొలగించి కొత్తవి చేర్చారు. GO విడుదలతో టెండర్లు పిలవనున్నారు.
News November 14, 2025
23వేల ఆధిక్యంలో నవీన్ యాదవ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ లీడ్ భారీగా పెరుగుతోంది. 8వ రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్ 23వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా 8 రౌండ్లలో ఆయన లీడ్ సాధించడం విశేషం. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి.
News November 14, 2025
ఆ భవనాలు IT Hub కోసం కాదు: అధికారులు

TG: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాలను ఐటీ హబ్ కోసం ఉపయోగిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. అవి తప్పుడు వార్తలని స్పష్టం చేశారు. అధునాతన ఆరోగ్య సేవలను అందించడానికి ప్రభుత్వం త్వరలో సనత్నగర్ TIMS, వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


