News March 26, 2024

నాలో ఇంకా ఆట మిగిలే ఉంది: విరాట్

image

పంజాబ్ కింగ్స్‌పై 49 బంతుల్లో 77 రన్స్‌ చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు విరాట్ కోహ్లీ. వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో తాను కచ్చితంగా ఆడాలనుకుంటున్న విషయాన్ని ఆయన మ్యాచ్ అనంతరం పరోక్షంగా వెల్లడించారు. ‘ఆటను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలి. నా పేరును ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు మాత్రమే వాడుతున్నారని తెలుసు. కానీ టీ20 క్రికెట్‌ ఆట నాలో ఇంకా మిగిలే ఉందనుకుంటున్నా’ అని అన్నారు.

Similar News

News December 1, 2025

రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే..

image

సినీ ఇండస్ట్రీలో విడాకులు, పలు కారణాలతో రెండో పెళ్లి చేసుకోవడం కామన్‌గా మారింది. రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా హీరోయిన్ <<18437680>>సమంత<<>> చేరారు. ఈ లిస్టులో సీనియర్ NTR, సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున, హరికృష్ణ, మోహన్ బాబు, మంచు మనోజ్, నాగ చైతన్య, అమలాపాల్, నిర్మాత దిల్ రాజు ఉన్నారు. పవన్ కళ్యాణ్, నటుడు నరేశ్, నటి రాధిక మూడో పెళ్లి చేసుకున్న వారి లిస్టులో ఉన్నారు.

News December 1, 2025

నుదురు వెనక్కి వెళ్లిపోతోందా?

image

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొనే సమస్య హెయిర్ లైన్ రిసీడింగ్. అంటే నుదుటిపై జుట్టు వెనక్కి వెళ్లిపోవడం. దీనివల్ల లుక్ మొత్తం మారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొప్పు గట్టిగా వేయడం, పాపిడి ఎప్పుడూ ఒకవైపే తీయడం వంటివి చేయకూడదు. అప్పుడు వెంట్రుకలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇలా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అలానే మీరు జుట్టు వేసుకొనేటప్పుడు లూజ్‌గా వెయ్యడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

News December 1, 2025

హసీనాపై మరో కేసు! భారత్‌పైనా ఆరోపణలు

image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని <<18408910>>షేక్ హసీనా<<>>పై మరో కేసు పెట్టేందుకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం సిద్ధమైంది. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు షేక్ హసీనా కారణమని చెబుతోంది. ఆ హింసాకాండలో భారత్ ప్రమేయం కూడా ఉందని అక్కడి సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలో పేర్కొంది. బంగ్లా ఆర్మీని బలహీనపరిచేందుకు ఆ హింసకు భారత్ మద్దతు ఇచ్చిందని ఆరోపిస్తోంది. 2009 హింసాకాండలో సీనియర్ ఆర్మీ అధికారులు సహా 74 మంది మరణించారు.