News December 19, 2024
అశ్విన్ అందుకే రిటైర్ అయ్యారనుకుంటున్నా: హర్భజన్

అశ్విన్ రిటైర్మెంట్ వెనుక కారణాన్ని హర్భజన్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో అంచనా వేశారు. ‘సిరీస్ నడుస్తుండగానే అశ్విన్ రిటైర్ కావడం చాలా ఆశ్చర్యం కలిగించింది. నాకున్న సమాచారం ప్రకారం.. BGT తర్వాత భారత్ స్వదేశంలో, ఇంగ్లండ్లో టెస్టులు ఆడనుంది. సెలక్టర్లు ఆ మ్యాచ్లకు అశ్విన్ను పరిగణించడం లేదు. అందుకే వెయిట్ చేయకుండా తనంతట తానే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 15, 2025
APPLY NOW: RRUలో 9 పోస్టులు

గుజరాత్లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ<
News November 15, 2025
మొత్తం పెట్టుబడులు రూ.13 లక్షల కోట్లు: CBN

AP: CII సదస్సు ద్వారా రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని CM CBN ప్రకటించారు. గత 18నెలల్లో ఇన్వెస్ట్మెంట్స్ రూ.22లక్షల కోట్లకు చేరాయన్నారు. శ్రీసిటీలో మరికొన్ని యూనిట్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు కంపెనీలతో MoUలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా 12,365 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 2028 నాటికి శ్రీసిటీని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామని స్పష్టం చేశారు.
News November 15, 2025
మిరప పంటకు వేరు పురుగుతో తీవ్ర నష్టం

వేరు పురుగులు మిరప పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి. బాగా పెరిగిన వేరు పురుగు ‘సి(C)’ ఆకారంలో ఉండి మొక్క వేర్లపై దాడి చేసి నాశనం చేస్తాయి. పిల్ల పురుగులు మొక్కల వేర్లను కత్తిరించడం వల్ల మొక్క పాలిపోతుంది. కొన్ని రోజుల వ్యవధిలో పూర్తిగా ఎండిపోతుంది. దీని ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. దీని వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడి రైతులు ఆర్థికంగా నష్టపోతారు.


