News March 18, 2024
చీకటి గదిలో ఒంటరిగా ఉంటూ బాధపడేవాడిని: అశ్విన్

ఓ దశలో క్రికెట్ను వదిలేద్దామని అనుకున్నానని టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ వెల్లడించారు. “గతంలో సరైన అవకాశాలు లేనప్పుడు మానసిక ఒత్తిడికి లోనయ్యా. ఓసారి ఇంట్లో నాన్నతో ఏదో గొడవైనప్పుడు ఆయన ‘నీకు నిజాయతీ ఎక్కువ అందుకే నష్టపోతున్నావ్’ అని అనేశారు. సాధారణంగా ఎప్పుడూ అంత బాధపడను. కానీ అప్పుడు గదిలోకి వెళ్లి గంటల తరబడి ఏడ్చాను. కొంతకాలం అలా చీకటి గదిలో ఒంటరిగా ఉంటూ బాధపడ్డాను” అని తెలిపారు.
Similar News
News January 6, 2026
GNT: నేడు సీఆర్డీఏ అథారిటీతో సీఎం సమావేశం

అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులు ఇతర విషయాలపై CRDA అథారిటీతో CM చంద్రబాబు మంగళవారం సమావేశం కానున్నారు. ముందుగా మంత్రి నారాయణ CRDA అధికారులతో సమీక్ష నిర్వహించి, మధ్యాహ్నం 2:30 నిమిషాలకు సచివాలయంలో జరిగే అథారిటీ సమావేశంలో చర్చించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి రైతుల సమస్యల త్రిసభ్య కమిటీతో CM భేటి కానున్నారు. సాయంత్రం 4 గంటలకు తీసుకున్న నిర్ణయాలు మంత్రి నారాయణ వెల్లడిస్తారు.
News January 6, 2026
31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లులేని భక్తులకు దర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,650మంది భక్తులు దర్శించుకున్నారు. 23,331మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న రూ.4.08కోట్ల హుండీ ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది.
News January 6, 2026
కిలో చికెన్ రూ.320.. మరింత పెరిగే అవకాశం!

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల చికెన్ ధర స్కిన్లెస్ కిలోకి రూ.320 వరకు ఉంది. చాలాకాలంగా పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉండటంతో చాలామంది కోళ్ల పెంపకాన్ని ఆపేశారు. డిమాండుకు తగ్గట్లు సప్లయ్ లేకపోవడం వల్లే ధరలు ఇంతలా పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అటు కోడిగుడ్డు ధర కూడా రూ.8గా ఉంది.


