News March 26, 2025
నాకు టీబీ జబ్బు ఉండేది: సీనియర్ నటి

తనకు టీబీ జబ్బు ఉందని, కానీ దీనిని సీక్రెట్గా ఉంచానని నటి సుహాసిని తెలిపారు. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందనే భయంతో రహస్యంగా 6 నెలలపాటు చికిత్స తీసుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను 2సార్లు (6,36 ఏళ్లు) TBతో బాధపడ్డా. ఆ సమయంలో విపరీతంగా బరువు తగ్గి, వినికిడి శక్తి కూడా కోల్పోయా. ఆ తర్వాత దాని నుంచి కోలుకున్నా. ప్రస్తుతం TBపై ప్రజలకు అవగాహన కల్పించాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News March 30, 2025
ఏప్రిల్ నుంచి ఉచితంగా రూ.5 లక్షల బీమా

TG: రాష్ట్రంలో 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆర్థిక పరిమితులతో సంబంధం లేకుండా ఏప్రిల్ నుంచి ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ అమలు కానుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది. ట్రీట్మెంట్, సర్జరీలు, మెడిసన్ ఖర్చులన్నీ కలిపి ఆ మొత్తానికి ఉచిత వైద్యం పొందొచ్చు. ఈ స్కీమ్ అమలుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య అధికారులు TGలోని 416 నెట్వర్క్ ఆస్పత్రులకు తాజాగా ఆదేశాలిచ్చారు.
News March 30, 2025
ఉగాది కానుక.. CMRF దస్త్రంపై చంద్రబాబు సంతకం

AP: పేదలకు సాయంపై ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.38 కోట్ల సీఎం సహాయనిధి దస్త్రంపై సంతకం చేశారు. దీని ద్వారా 3,456 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.281 కోట్లు విడుదల అయ్యాయి. మరోవైపు, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం 86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది అవార్డులు ప్రదానం చేశారు.
News March 30, 2025
హార్దిక్ పాండ్యకు మరో షాక్!

వరుస ఓటముల్లో ఉన్న MI కెప్టెన్ హార్దిక్ పాండ్యకు మరో షాక్ తగిలింది. నిన్న GTతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆయనకు IPL గవర్నింగ్ కౌన్సిల్ రూ.12లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఓ కెప్టెన్కు ఫైన్ పడటం ఇదే తొలిసారి. గత సీజన్ ఆఖరి మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ ఉండటంతో ఈ ఏడాది తొలి మ్యాచ్లో హార్దిక్ నిషేధానికి గురయ్యారు. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ తరచూ జరిమానాల్ని ఎదుర్కొంటున్నారు.