News December 17, 2024

జోగి రమేశ్‌ను చూసి షాక్‌కు గురయ్యా: పార్థసారథి

image

AP: నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు జోగి రమేశ్ దురుద్దేశంతో వచ్చి ఉండొచ్చని మంత్రి పార్థసారథి అన్నారు. ‘నన్ను ఆదరించిన TDP కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు సారీ. ఇది పార్టీలకతీతంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం. ఆ సమయంలో జోగి రమేశ్‌ను చూసి షాక్‌కు గురయ్యాను. ఆయనకు, నాకు వ్యక్తిగత సంబంధాలు లేవు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటా’ అని ప్రెస్‌మీట్‌లో పార్థసారథి చెప్పారు.

Similar News

News November 13, 2025

భారీగా పెరిగిన కూరగాయల ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు వినియోగదారులను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. చాలా రకాల కూరగాయలు పావుకేజీ రూ.30కి తక్కువ లభించడం లేదు. అంటే కేజీ రూ.100-120 పలుకుతోంది. రైతు బజార్లతోపాటు వారపు సంతల్లోనూ రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి. ఆకుకూరల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇటీవల మొంథా తుఫాన్‌తో పంటలు తీవ్రంగా దెబ్బతినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మీరూ కూరగాయల రేట్లతో షాక్ అయ్యారా?

News November 13, 2025

ఇతిహాసాలు క్విజ్ – 65

image

ఈరోజు ప్రశ్న: దేవవ్రతుడు ఎవరు? ఆయన ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఆ ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 13, 2025

ఐబీలో 258 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 258 ACIO పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 16 ఆఖరుతేదీ. B.E./B.Tech/M.Tech ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. వెబ్‌సైట్: https://www.mha.gov.in/