News October 5, 2024
నన్నే ఎక్కువ టార్గెట్ చేశారు: ప్రియమణి
వేరే మతస్థుడిని ఎలా పెళ్లి చేసుకుంటావని కొందరు తనను ట్రోల్స్ చేశారని నటి ప్రియమణి తెలిపారు. ఇప్పటికీ ఆ ట్రోల్స్ ఆగడం లేదని ఆమె వాపోయారు. ‘2016లో ముస్తఫా రాజ్తో నిశ్చితార్థమైనప్పటి నుంచి నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. ఎంతో మంది స్టార్లు కుల, మతాంతర వివాహం చేసుకున్నా నన్నే నిందించడం బాధించింది. కుల, మత వ్యత్యాసాలు ప్రేమకు ఉండవు. ఆ విషయం వారికి తెలిసినట్లు లేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు.
Similar News
News October 5, 2024
త్వరలో CSK ప్రతినిధులతో ధోనీ భేటీ?
ఈ నెలలో సీఎస్కే ప్రతినిధులతో మహేంద్ర సింగ్ ధోనీ ముంబైలో సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే సీజన్లో తాను ఆడేదీ లేనిదీ వారితో తేల్చి చెప్తారని తెలుస్తోంది. కాగా సీఎస్కే మాత్రం ధోనీ అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కనీస ధర రూ.4 కోట్లు చెల్లించి ఆయనను దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
News October 5, 2024
అరుదైన రికార్డు ముంగిట హార్దిక్
బంగ్లాతో T20 సిరీస్ ముంగిట భారత పేస్ ఆల్రౌండర్ హార్దిక్ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇప్పటి వరకు T20ల్లో 86 వికెట్లు తీసిన పాండ్య మరో 5 తీస్తే ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్గా నిలుస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు భువనేశ్వర్(90) పేరిట ఉంది. మొత్తంగా చూసుకుంటే స్పిన్నర్ చాహల్ 96 వికెట్లతో టాప్లో ఉన్నారు. బుమ్రా 86 వికెట్లు తీసినప్పటికీ అతడు బంగ్లాతో సిరీస్ ఆడటం లేదు.
News October 5, 2024
ఫొటో గ్యాలరీ.. హంసవాహనంపై తిరుమలేశుడు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ వేంకటేశ్వరుడు హంసవాహనంపై తిరుమల మాడ వీధుల్లో విహరించారు. సరస్వతీమూర్తి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కనులపండువగా సాగిన మహోత్సవ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.