News April 10, 2025

నేనెప్పటికీ తలా ఫ్యానే: అంబటి రాయుడు

image

CSK, ఎంఎస్ ధోనీకి మద్దతుగా మాట్లాడుతున్నారంటూ తనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌కు అంబటి రాయుడు కౌంటర్ ఇచ్చారు. ‘నేనెప్పటికీ తలా అభిమానినే. ఎవరేమనుకున్నా, ఏం చేసినా ఫర్వాలేదు. ఇందులో ఏమాత్రం తేడా ఉండదు. కాబట్టి పెయిడ్ పీఆర్ కోసం డబ్బులు ఖర్చు చేయడం ఆపేయండి. ఆ డబ్బుల్ని పేదలకు డొనేట్ చేయండి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News April 18, 2025

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

image

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో వీటికి చోటు దక్కింది. ఇది ప్రపంచంలోని ప్రతీ భారతీయుడికి గర్వకారణమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారతీయ సంస్కృతికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా దేశ నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయని పేర్కొన్నారు.

News April 18, 2025

ఏసుక్రీస్తు త్యాగాన్ని గుర్తుచేసుకోవాలి: PM మోదీ

image

గుడ్‌ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులనుద్దేశించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ పవిత్ర రోజున ఏసుక్రీస్తు త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలన్నారు. ఆయనలోని దయ, కరుణ, క్షమాపణ వంటి సద్గుణాలు మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం క్రీస్తు గొప్పతనాన్ని గుర్తు చేశారు. తన శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఏసుక్రీస్తు శాంతిని ప్రబోధించారన్నారు.

News April 18, 2025

రేపు జేఈఈ మెయిన్ ఫలితాలు: NTA

image

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫలితాలను రేపు వెల్లడిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. ఫైనల్ ఆన్సర్ కీలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అధికారిక <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. నిన్న ఫైనల్ ‘కీ’ని రిలీజ్ చేసి, మళ్లీ వెబ్‌సైట్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!