News August 25, 2025
మళ్లీ ఓయూకు వస్తా.. ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెడతా: రేవంత్

TG: డిసెంబర్లో మరోసారి తాను ఓయూకు వస్తానని CM రేవంత్ ప్రకటించారు. ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెట్టి, వర్సిటీకి రూ.వందల కోట్ల నిధులు ఇస్తానన్నారు. ఆరోజు ఒక్క పోలీస్ కూడా క్యాంపస్లో ఉండొద్దని DGPని ఆదేశించారు. నిరసన తెలిపే విద్యార్థులకు ఆ స్వేచ్ఛ కల్పిస్తానని తేల్చి చెప్పారు. తాను రావొద్దనే ఆలోచన ఏ విద్యార్థికీ ఉండదని.. గొర్రెలు, బర్రెలు పెంచుకునేటోడికి మాత్రమే ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Similar News
News August 25, 2025
లారీ కింద నలిగిపోయిన తండ్రీ కూతుళ్లు!

TG: ఊహించని ప్రమాదంలో ఒకేసారి తండ్రీ కూతుళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి(D) చేవెళ్లలో చోటుచేసుకుంది. గురుకుల స్కూలులో చదువుతున్న కూతురు కృప(12)ను తండ్రి రవీందర్(32) బైకుపై ఇంటికి తీసుకువస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొని వారి పైనుంచి వెళ్లింది. టైర్ల కింద నలిగిన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రీ కూతుళ్ల మరణం స్థానికులను కంటతడి పెట్టించింది.
News August 25, 2025
కొరత ఉండదు.. ఆందోళన వద్దు: అచ్చెన్నాయుడు

APలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేసి, ఇప్పటివరకు 21.34 లక్షల మె.టన్నులు సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, 10,800 మెట్రిక్ టన్నులు ఒడిశా పోర్ట్ నుంచి దిగుమతి అవుతుందని, డిపోల్లోని 79,633 మెట్రిక్ టన్నులను అవసరమైన ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు.
News August 25, 2025
ఉద్యోగి మెంటల్ హెల్త్ కోసం ‘అన్హ్యాపీ లీవ్’

చైనాలోని ఓ కంపెనీ అమలుచేస్తోన్న రూల్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు ‘అన్హ్యాపీ లీవ్’ను తీసుకొచ్చింది. ఉద్యోగి సంతోషంగా లేనప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు దీనిని వాడొచ్చు. ‘నేను సంతోషంగా లేను’ అని చెప్పి లీవ్ పెట్టొచ్చు. ఇలా ఏడాదికి 10 సార్లు లీవ్ తీసుకోవచ్చు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా పనిచేయగలరని సంస్థ నమ్ముతోంది.