News March 8, 2025

అసెంబ్లీకి వస్తా.. కాంగ్రెస్ అంతు చూస్తా: కేసీఆర్

image

TG: రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగిపోయారని మాజీ సీఎం KCR అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రభుత్వ తీరును ఎండగడతానని చెప్పారు. ‘కాంగ్రెస్ సర్కార్ అసత్య ప్రచారాలతో కాలం వెళ్లదీస్తోంది. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా BRSదే అధికారం. వచ్చే నెల 27న వరంగల్‌లో జరిగే సభలో కాంగ్రెస్, బీజేపీని నిలదీస్తాం’ అని పేర్కొన్నారు.

Similar News

News March 30, 2026

నేడు 2.50లక్షల మందికి ఇళ్ల పంపిణీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వం నేడు రెండో విడత ఇళ్ల పంపిణీ చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష టిడ్కో ఇళ్లతో పాటు మరో 1.50లక్షల గృహాలను లబ్ధిదారులకు అందించనుంది. తిరుపతి జిల్లా పుదూరులో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని గృహప్రవేశాలు చేయించనున్నారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 5.50లక్షలకు చేరనుందని ప్రభుత్వం తెలిపింది. 2025 నవంబరు 12న తొలి విడత కింద 3లక్షల ఇళ్లను అందించింది.

News March 30, 2026

మహాలక్ష్మి పథకంతో మహిళలకు ₹10వేల కోట్లు ఆదా: TGSRTC

image

TG: మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంతో మహిళలకు ఆదా అయిన ఛార్జీల మొత్తం ₹10వేల కోట్లకు చేరినట్లు TGSRTC ప్రకటించింది. దాదాపు 290కోట్లకుపైన జీరో టికెట్‌ను మహిళలు వినియోగించుకున్నట్లు తెలిపింది. ఈ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య 40% నుంచి 67%కు పెరిగిందని వెల్లడించింది. ఒకప్పుడు రవాణా ఛార్జీలపై మహిళలు సగటున ₹1500-2500 వెచ్చించేవారని.. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని పొదుపు చేసుకుంటున్నారని పేర్కొంది.

News March 30, 2026

నేడు RR vs CSK

image

ఐపీఎల్‌లో ఈరోజు మూడో మ్యాచ్ జరగనుంది. అస్సాంలోని బర్సపారా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. రాజస్థాన్‌కు గత ఏడాది మొదటి మూడు మ్యాచ్‌లు కెప్టెన్సీ చేపట్టిన పరాగ్ ఈసారి ఆ జట్టుకు పూర్తిగా సారథ్యం వహిస్తారు. మరోవైపు CSKకు రుతురాజ్ సారథ్యం కొనసాగిస్తారు. ఇప్పటివరకు ఈ జట్లు 31సార్లు తలపడగా CSK 16, RR 15సార్లు గెలిచింది. ఈరోజు రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది.