News March 20, 2024

పవన్ ఎంపీగా బరిలో ఉంటే పిఠాపురంలో నేనే పోటీ చేస్తా: వర్మ

image

AP: అమిత్ షా సూచిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని, పిఠాపురంలో ఉదయ్ బరిలో ఉంటారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ నేత ఎస్వీఎస్‌ఎన్ వర్మ స్పందించారు. ‘పొత్తులో భాగంగా కూటమి గెలుపు కోసం పని చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు మాటకు కట్టుబడి పవన్ గెలుపు కోసం కృషి చేస్తా. ఒకవేళ ఆయన కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం అసెంబ్లీ స్థానంలో నేనే బరిలో ఉంటా’ అని తెలిపారు.

Similar News

News February 2, 2026

అయితే ఆరిక, కాకుంటే కంది, దున్ని చల్లితే శనగ

image

వాతావరణం, నేల పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆరిక(చిరు ధాన్యాల) పంట బాగా పండుతుంది. ఒకవేళ పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా కంది పంట ఎలాగోలా పండుతుంది. భూమిని బాగా దున్ని, శ్రద్ధగా విత్తనాలు చల్లితే, శనగ పంట తప్పకుండా మంచి దిగుబడినిస్తుంది. ఈ సామెత ముఖ్యంగా వివిధ పంటలకు అవసరమైన శ్రమ, దిగుబడి, హామీ గురించి వివరిస్తుంది. శనగ పంటకు మంచి భూమి తయారీ, శ్రద్ధ అవసరమని చెబుతుంది.

News February 2, 2026

దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి?

image

పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదను ప్రసాదంగా స్వీకరించాలి. పిండిని చక్కెర పొంగలిలో కలపాలి. చిన్న చిన్న గారెలు చేసి స్వామికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఆ తర్వాత ఇంట్లోవాళ్లు పంచుకోవాలి. పిండి దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పారేయకూడదు. చివరగా స్వామి సన్నిధిలో కొబ్బరికాయ కొట్టి, మనసులోని కోరికను చెప్పుకుని నమస్కరించుకోవాలి. ఇలా చేయడం వల్ల వ్రత ఫలితం పూర్తయి, సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం.

News February 2, 2026

అరకు అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రాజెక్ట్

image

AP: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రెండు ఎకో టూరిజం ప్రాజెక్టులను ప్రకటించారు. అరకులో ప్రపంచ స్థాయి ట్రెక్కింగ్, హైకింగ్ కోసం మౌంటైన్ ట్రైల్స్ ప్రాజెక్టును, పులికాట్ సరస్సుకు వచ్చే వలస పక్షులను పర్యాటకులు దగ్గర నుంచి చూసేలా మరో ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురానున్నారు. తూర్పు కనుమల్లో పర్వత మార్గాలను ట్రెక్కింగ్ కోసం అభివృద్ధి చేసి అరకుకు మరింత గుర్తింపు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.