News April 13, 2025

క్షమాపణలు చెప్పను: రాకేశ్ రెడ్డి

image

TGPSC తనకు పరువునష్టం నోటీసులు <<16075233>>పంపడంపై <<>>BRS నేత రాకేశ్ రెడ్డి స్పందించారు. ‘పూర్తి ఆధారాలతో గ్రూప్-1 అవకతవకలు బయటపెట్టాం. వాటికి TGPSC సమాధానం చెప్పట్లేదు. కమిషన్ ఇలా పరువునష్టం నోటీసులు ఇవ్వడం దేశంలోనే ప్రథమం. నోటీసులు ఇచ్చినా నేను క్షమాపణలు చెప్పను. న్యాయవిచారణ జరిపిస్తే ఆధారాలు చూపిస్తాం. నేనే TGPSCపై పరువునష్టం దావా వేయబోతున్నా. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని స్పష్టం చేశారు.

Similar News

News April 15, 2025

‘కోపిష్టి’ ఇమేజ్‌ను మార్చుకునే పనిలో గోయెంకా!

image

IPLలో తమ జట్టు ఓటమి తర్వాత కెప్టెన్, ఆటగాళ్లకు <<15878257>>క్లాస్ తీసుకునే<<>> LSG ఓనర్ సంజీవ్ గోయెంకా ఈసారి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నిన్న థ్రిల్లర్ మ్యాచ్‌లో CSK చేతిలో ఓటమి తర్వాత కూడా నవ్వుతూ కనిపించారు. కెప్టెన్ పంత్ భుజంపై చేయి వేసి సరదాగా మాట్లాడారు. CSK సారథి ధోనీని హత్తుకుని అభినందించారు. దీంతో ఆయన తన ‘కోపిష్టి’ ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News April 15, 2025

భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. sensex 1,579 పాయింట్లు, nifty 469 పాయింట్ల లాభంతో ట్రేడ్ ప్రారంభించాయి. ట్రంప్ టారిఫ్స్‌కు బ్రేక్, యూఎస్ మార్కెట్లు లాభాల్లో ముగియడం, రెపో రేటు తగ్గుదలతో లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం sensex 76,737 పాయింట్లు, nifty 23,298 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, టెలికాం షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి.

News April 15, 2025

యూరిన్ ఆపుకుంటున్నారా?

image

బిజీగా ఉండటం, వాష్‌రూమ్స్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో మూత్ర విసర్జనను ఆపుకుంటూ ఉంటాం. ఇది తరుచూ జరిగితే మూత్రాశయం సాగి కండరాలు బలహీనమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని, కిడ్నీలపై భారం పెరిగి వాటి పనితీరు దెబ్బతింటుందంటున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడతాయని పేర్కొంటున్నారు. సరిపడా నీళ్లు తాగుతూ ఎప్పటికప్పుడు మూత్రవిసర్జన చేయాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!