News April 13, 2025
క్షమాపణలు చెప్పను: రాకేశ్ రెడ్డి

TGPSC తనకు పరువునష్టం నోటీసులు <<16075233>>పంపడంపై <<>>BRS నేత రాకేశ్ రెడ్డి స్పందించారు. ‘పూర్తి ఆధారాలతో గ్రూప్-1 అవకతవకలు బయటపెట్టాం. వాటికి TGPSC సమాధానం చెప్పట్లేదు. కమిషన్ ఇలా పరువునష్టం నోటీసులు ఇవ్వడం దేశంలోనే ప్రథమం. నోటీసులు ఇచ్చినా నేను క్షమాపణలు చెప్పను. న్యాయవిచారణ జరిపిస్తే ఆధారాలు చూపిస్తాం. నేనే TGPSCపై పరువునష్టం దావా వేయబోతున్నా. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని స్పష్టం చేశారు.
Similar News
News November 20, 2025
రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

RRB 5,810 NTPC పోస్టుల దరఖాస్తు గడువును పొడిగించింది. నేటితో అప్లై గడువు ముగియగా.. ఈనెల 27వరకు పొడిగించింది. ఫీజు చెల్లించడానికి ఈ నెల 29 వరకు ఛాన్స్ ఇచ్చింది. డిగ్రీ అర్హతతో 18- 33ఏళ్లు గల వారు అప్లై చేసుకోవచ్చు. CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 20, 2025
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ టర్మ్స్

బిహార్ రాజకీయ భీష్ముడిగా పేరొందిన నితీశ్ ఇవాళ 10వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన తొలిసారి 2000 సం.లో సీఎం అయ్యారు. అప్పటి నుంచి బీజేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్, లోక్ జన్శక్తి.. ఇలా ఎన్నో పార్టీలతో కలిసి సీఎం పీఠాన్ని అధిరోహించారు.
*2000 మార్చి 3- 2000 మార్చి 7 *2005-2010
*2010-2014 *2015 FEB 22- 2015 NOV 19 *2015-2017 *2017-2020 *2020-2022 *2022-24 *2024-2025 NOV.
News November 20, 2025
542 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)లో 542 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 24లోపు అప్లై చేసుకుని దరఖాస్తును స్పీడ్ పోస్టులో పంపాలి. వెహికల్ మెకానిక్, MSW పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. రాతపరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, PET, ట్రేడ్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bro.gov.in/


