News August 3, 2024
టీడీపీ వచ్చినా నాకు న్యాయం జరగట్లేదు: బుద్దా వెంకన్న

AP: పదవి లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నానంటూ ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన వేడుకల్లో బుద్దా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. ‘సీఐల బదిలీల విషయంలో నా మాట చెల్లలేదు. వైసీపీ పాలనపై అనేక పోరాటాలు చేశాను. నాపై 37 కేసులున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చినా నాకు న్యాయం జరగట్లేదు. వ్యతిరేకతతో కాదు, ఆవేదనతో మాత్రమే ఈ విషయాన్ని చెబుతున్నా. నా ఆవేదనను అధిష్ఠానం దృష్టికి ఎంపీ కేశినేని చిన్ని తీసుకెళ్లాలి’ అని కోరారు.
Similar News
News March 19, 2026
అకాల వర్షం.. రైతన్నకు తీరని కష్టం

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టం మిగిల్చాయి. నిన్న కోస్తా, రాయలసీమతోపాటు TGలో అక్కడక్కడ గాలివాన బీభత్సం సృష్టించింది. గంటకు 30-40 KMతో ఈదురుగాలులు, వడగళ్ల వానతో అరటి, మామిడి, మొక్కజొన్న, మినుములు, వరి దెబ్బతిన్నాయి. మరోవైపు పిడుగులు పడి APలోని బాపట్ల, పల్నాడు, గుంటూరు, TGలోని వనపర్తిలో ఒక్కరు చొప్పున మరణించారు. వికారాబాద్ జిల్లాలో పిడుగుపాట్లకు 300 మేకలు చనిపోయాయి.
News March 19, 2026
నేడే జాబ్ క్యాలెండర్.. 5 శాఖల్లో 8,340 పోస్టులు!

AP: రాష్ట్ర ప్రభుత్వం నేడు 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఇందులో 5 శాఖల్లోనే 8,340 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా విద్యాశాఖలో 4,500 పోస్టులు ఉన్నాయని సమాచారం. వర్సిటీల్లో 1,500, DSC, ఇతర పోస్టులు 3 వేలు, హోంశాఖలో 3 వేలు, ఎక్సైజ్ శాఖలో 450 ఉద్యోగాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో 4 దశల్లో వీటిని భర్తీ చేసే అవకాశం ఉంది. మంత్రి లోకేశ్ ఈ క్యాలెండర్ను రిలీజ్ చేయనున్నారు.
News March 19, 2026
కొత్త డీజీపీ రేసులో ముగ్గురు!

TG: డీజీపీ నియామకానికి అర్హులైన ముగ్గురు అధికారుల లిస్టు రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. సీవీ ఆనంద్(1991 బ్యాచ్), వినయ్ ప్రభాకర్ ఆప్టే(1994 బ్యాచ్), సౌమ్యా మిశ్రా(1994 బ్యాచ్)తో కూడిన ఫైనల్ లిస్టును యూపీఎస్సీ పంపింది. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డీజీపీ శివధర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ 30తో ముగియనుంది.


