News March 26, 2025
నేనలా అన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: డీకే

ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యాంగాన్ని మారుస్తామని తాను అనలేదని కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ తెలిపారు. తాను అలా అన్నట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ‘ముస్లింలకు కోటా కల్పించడానికి రాజ్యాంగాన్ని మార్చగల “మంచి రోజు” రావచ్చు’ అని ఇటీవల ఓ కార్యక్రమంలో డీకే వ్యాఖ్యానించారు. దీంతో ఈ వివాదం మొదలైంది.
Similar News
News October 15, 2025
20 మంది మృతి.. పరిహారం ప్రకటించిన ప్రధాని

రాజస్థాన్లో జైసల్మేర్ నుంచి జోధ్పూర్కు వెళ్తున్న బస్సు <<18008110>>దగ్ధమై<<>> 20 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరో 16 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
News October 15, 2025
ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చి.. కొడుకుకు తండ్రి గుణపాఠం!

TG: తన బాగోగులు చూసుకోని కొడుకుకు సరైన గుణపాఠం చెప్పాడా తండ్రి. హన్మకొండ(D) ఎల్కతుర్తి మాజీ MPP శ్యాంసుందర్ రూ.3Cr విలువైన మూడెకరాల భూమిని ప్రభుత్వానికి రాసిచ్చారు. ప్రభుత్వ స్కూల్/ కాలేజీ కట్టి తన భార్య పేరు పెట్టాలని కోరారు. భార్య మరణించినప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆయనను కొడుకు రంజిత్ రెడ్డి చేరదీయలేదు. పైగా కొంత ఆస్తి తన పేరిట రాయించుకొని దాడి చేశారు. దీంతో శ్యాంసుందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
News October 15, 2025
ఆవు పేడతో నెలకు రూ.25వేల ఆదాయం

జీవితంలో ఎదగాలనే తపన ఉంటే ఆవు పేడతోనూ అద్భుతాలు చేయొచ్చని నిరూపిస్తున్నారు మధ్యప్రదేశ్ సాగర్ ప్రాంత మహిళలు. పేడతో కుందులు, బొమ్మలు, ల్యాంప్స్, గోడ గడియారాల లాంటివి తయారు చేసి విక్రయిస్తున్నారు. కొన్ని వస్తువులను విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా సగటున ₹25K వరకు సంపాదిస్తున్నారు. పండుగ సమయాల్లో ఈ మొత్తం ₹80వేలకు చేరుతోంది.
* రోజూ మహిళల స్ఫూర్తిదాయక కథనాల కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.